E-Paper
Advertisement

India To America: అమెరికాలో ఇండియన్ ఫోన్ల హవా.. చైనాకు చెక్.. ప్రతి 3 ఫోన్లలో ఒకటి మనదే!

India To America: అమెరికాలో ఇండియన్ ఫోన్ల హవా.. చైనాకు చెక్.. ప్రతి 3 ఫోన్లలో ఒకటి మనదే!
Advertisement

ఒకప్పుడు మేడిన్ అమెరికా, మేడిన్ జపాన్, మేడిన్ ఇంగ్లండ్ వస్తువులంటే మన దేశంలో భలే క్రేజ్. ఇప్పుడు ఆ దేశాలకు చెందిన కంపెనీలు కూడా మన దేశంలోనే ప్లాంట్లను పెట్టి ఇక్కడే వాటిని తయారు చేస్తున్నాయి. అంటే ఇప్పుడు ఆ పెద్ద పెద్ద కంపెనీలన్నీ మేడిన్ ఇండియా బ్రాండ్ ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నాయనమాట. తాజాగా ఇలాంటి ఎగుమతుల్లో భారత్ మరో పెద్ద మైలురాయిని అందుకుంది. అమెరికాకు ఎగుమతి అయ్యే ప్రతి 3 స్మార్ట్ ఫోన్లలో ఒకటి ఇండియాలో తయారైందే కావడం ఈ ఘనతకు కారణం. ఇప్పటి వరకు స్మార్ట్ ఫోన్ల ఎగుమతుల్లో చైనా టాప్ ప్లేస్ లో ఉండగా, దాన్ని రీప్లేస్ చేసేందుకు భారత్ దూసుకెళ్తోంది.

చైనాని వెనక్కు నెట్టిన భారత్..
2025 ప్రారంభం నుంచి ఎగుమతుల్లో భారత్ దూకుడుగా ఉంది. ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లో అమెరికాకు ఎగుమతి అయ్యే స్మార్ట్ ఫోన్లలో భారత్ వాటా 36 శాతానికి పెరిగింది. గతేడాది ఇది కేవలం 11 శాతం మాత్రమే. ఇక చైనా గతేడాది 82 శాతం ఫోన్లను అమెరికాకు ఎగుమతి చేయగా, ఈ ఏడాది ఆ పర్సంటేజ్ 49 దగ్గర ఆగిపోయింది. అంటే భారత్, చైనాను వెనక్కు నెట్టేందుకు ఎంతోకాలం ఆగాల్సిన పనిలేదనమాట.

Advertisement

యాపిల్ టాప్..
భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న స్మార్ట్ ఫోన్లలో యాపిల్ కంపెనీ ఫోన్లు టాప్ ప్లేస్ లో ఉన్నాయి. విలువ పరంగా యాపిల్ ఫోన్లు ఎక్కువ శాతం ఆక్రమించాయి. అయితే ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ బాంబు పేల్చారు. భారత్ లో తయారు చేసిన ఐఫోన్‌లను అమెరికాలో అమ్మితే 25 శాతం సుంకం విధిస్తానని హెచ్చరించారు. ఆయన హెచ్చరిక ప్రభావం ఇంకా మన ఎగుమతులపై పడలేదు. అదే సమయంలో యాపిల్ కంపెనీ ఇండియాని అత్యంత నమ్మకమైన తయారీ కేంద్రంగా భావిస్తోంది. భారత్ లో తయారీని మరింత వృద్ధి చేస్తోంది. ఏప్రిల్ నుంచి మొదలు పెడితే అమెరికాలో అమ్ముడవుతున్న ఐఫోన్లు ఎక్కువగా భారత్ నుంచే వెళ్లాయి. ప్రపంచ వ్యాప్తంగా 100 ఐ ఫోన్లు తయారైతే అందులో 20 ఫోన్లు ఇండియాలోనే తయారు చేస్తోంది యాపిల్ కంపెనీ. ఇంతకు ముందు చైనాలో ఎక్కువ ఫోన్లు తయారు చేస్తే, ఇప్పుడా స్థానం భారత్ ఆక్రమిస్తోంది.

ఇండియా చొరవ..
అమెరికా ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిషన్ (USITC) డేటా ప్రకారం, ఈ ఏడాది మే నెల వరకు అమెరికాకు వెళ్లే భారత స్మార్ట్ ఫోన్ల ఎగుమతులు మూడు రెట్లు పెరిగి 21.3 మిలియన్ యూనిట్లకు చేరుకున్నాయి. విలువ ఆధారంగా ఈ మొత్తం 182 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. అంటే అది 9.35 బిలియన్ డాలర్లు అన్నమాట. దేశీయంగా స్మార్ట్‌ఫోన్‌ల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం తీసుకున్న చొరవ ఫలితం ఇది అని అంటున్నారు. 2014-15తో పోల్చి చూస్తే నేడు భారతదేశంలో మొబైల్ ఫోన్ల ఉత్పత్తి 28 రెట్లు పెరిగింది. మొబైల్ ఫోన్ల విలువ రూ.5.45 లక్షల కోట్లకు చేరుకోవడం విశేషం. ఎగుమతులు 127 రెట్లు పెరిగి 2 లక్షల కోట్లకు చేరుకున్నాయి.

Related News

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

200 అప్లికేషన్లు, 15 ఇంటర్వ్యూలు ఫెయిల్.. చివరికి డిష్‌వాషింగ్ జాబ్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వ్యధ

కరెన్సీ నోట్లపై గీతలకు ఇంత అర్థముందా? ఇన్నాళ్లు పిచ్చి గీతలు అనుకున్నామే..!

ఖరీదైన ఫోన్ కొనేముందు ఈ ట్రిక్ తెలుసుకోండి.. ఈఎంఐ వడ్డీ చెల్లించే బదులు రాబడి పొందండి

పతనమవుతున్న బంగారం ధర.. అంతర్జాతీయ పరిణామాలేంటి? తెలుగు రాష్ట్రాల్లో రేట్లు పరిశీలిద్దాం

Big Stories

Advertisement
×