BigTV English

India To America: అమెరికాలో ఇండియన్ ఫోన్ల హవా.. చైనాకు చెక్.. ప్రతి 3 ఫోన్లలో ఒకటి మనదే!

India To America: అమెరికాలో ఇండియన్ ఫోన్ల హవా.. చైనాకు చెక్.. ప్రతి 3 ఫోన్లలో ఒకటి మనదే!

ఒకప్పుడు మేడిన్ అమెరికా, మేడిన్ జపాన్, మేడిన్ ఇంగ్లండ్ వస్తువులంటే మన దేశంలో భలే క్రేజ్. ఇప్పుడు ఆ దేశాలకు చెందిన కంపెనీలు కూడా మన దేశంలోనే ప్లాంట్లను పెట్టి ఇక్కడే వాటిని తయారు చేస్తున్నాయి. అంటే ఇప్పుడు ఆ పెద్ద పెద్ద కంపెనీలన్నీ మేడిన్ ఇండియా బ్రాండ్ ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నాయనమాట. తాజాగా ఇలాంటి ఎగుమతుల్లో భారత్ మరో పెద్ద మైలురాయిని అందుకుంది. అమెరికాకు ఎగుమతి అయ్యే ప్రతి 3 స్మార్ట్ ఫోన్లలో ఒకటి ఇండియాలో తయారైందే కావడం ఈ ఘనతకు కారణం. ఇప్పటి వరకు స్మార్ట్ ఫోన్ల ఎగుమతుల్లో చైనా టాప్ ప్లేస్ లో ఉండగా, దాన్ని రీప్లేస్ చేసేందుకు భారత్ దూసుకెళ్తోంది.


చైనాని వెనక్కు నెట్టిన భారత్..
2025 ప్రారంభం నుంచి ఎగుమతుల్లో భారత్ దూకుడుగా ఉంది. ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లో అమెరికాకు ఎగుమతి అయ్యే స్మార్ట్ ఫోన్లలో భారత్ వాటా 36 శాతానికి పెరిగింది. గతేడాది ఇది కేవలం 11 శాతం మాత్రమే. ఇక చైనా గతేడాది 82 శాతం ఫోన్లను అమెరికాకు ఎగుమతి చేయగా, ఈ ఏడాది ఆ పర్సంటేజ్ 49 దగ్గర ఆగిపోయింది. అంటే భారత్, చైనాను వెనక్కు నెట్టేందుకు ఎంతోకాలం ఆగాల్సిన పనిలేదనమాట.

యాపిల్ టాప్..
భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న స్మార్ట్ ఫోన్లలో యాపిల్ కంపెనీ ఫోన్లు టాప్ ప్లేస్ లో ఉన్నాయి. విలువ పరంగా యాపిల్ ఫోన్లు ఎక్కువ శాతం ఆక్రమించాయి. అయితే ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ బాంబు పేల్చారు. భారత్ లో తయారు చేసిన ఐఫోన్‌లను అమెరికాలో అమ్మితే 25 శాతం సుంకం విధిస్తానని హెచ్చరించారు. ఆయన హెచ్చరిక ప్రభావం ఇంకా మన ఎగుమతులపై పడలేదు. అదే సమయంలో యాపిల్ కంపెనీ ఇండియాని అత్యంత నమ్మకమైన తయారీ కేంద్రంగా భావిస్తోంది. భారత్ లో తయారీని మరింత వృద్ధి చేస్తోంది. ఏప్రిల్ నుంచి మొదలు పెడితే అమెరికాలో అమ్ముడవుతున్న ఐఫోన్లు ఎక్కువగా భారత్ నుంచే వెళ్లాయి. ప్రపంచ వ్యాప్తంగా 100 ఐ ఫోన్లు తయారైతే అందులో 20 ఫోన్లు ఇండియాలోనే తయారు చేస్తోంది యాపిల్ కంపెనీ. ఇంతకు ముందు చైనాలో ఎక్కువ ఫోన్లు తయారు చేస్తే, ఇప్పుడా స్థానం భారత్ ఆక్రమిస్తోంది.


ఇండియా చొరవ..
అమెరికా ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిషన్ (USITC) డేటా ప్రకారం, ఈ ఏడాది మే నెల వరకు అమెరికాకు వెళ్లే భారత స్మార్ట్ ఫోన్ల ఎగుమతులు మూడు రెట్లు పెరిగి 21.3 మిలియన్ యూనిట్లకు చేరుకున్నాయి. విలువ ఆధారంగా ఈ మొత్తం 182 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. అంటే అది 9.35 బిలియన్ డాలర్లు అన్నమాట. దేశీయంగా స్మార్ట్‌ఫోన్‌ల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం తీసుకున్న చొరవ ఫలితం ఇది అని అంటున్నారు. 2014-15తో పోల్చి చూస్తే నేడు భారతదేశంలో మొబైల్ ఫోన్ల ఉత్పత్తి 28 రెట్లు పెరిగింది. మొబైల్ ఫోన్ల విలువ రూ.5.45 లక్షల కోట్లకు చేరుకోవడం విశేషం. ఎగుమతులు 127 రెట్లు పెరిగి 2 లక్షల కోట్లకు చేరుకున్నాయి.

Related News

Amazon Weekend Deals: అమెజాన్ దీపావళి స్పెషల్ డీల్స్! 65 వేల వరకు డిస్కౌంట్.. ఈ వీకెండ్‌ మిస్ కాకండి!

Jio recharge plan: ఖరీదైన రీచార్జ్‌లకు గుడ్‌బై!.. జియో 51 ప్లాన్‌తో అన్‌లిమిటెడ్‌ 5G డేటా

Gold Capital of India: భారతదేశ గోల్డ్ రాజధాని ఏదో తెలుసా..? ఇక్కడ నుంచి భారీగా బంగారం ఉత్పత్తి..

Open beta: కలర్‌ఓఎస్ 16, ఆక్సిజన్‌ఓఎస్ 16 బీటా రిలీజ్.. మీ ఫోన్‌కి అర్హత ఉందా? చెక్ చేయండి!

Jio Offers: జియో రీచార్జ్ ప్లాన్స్ 2025.. 75 నుండి 223 రూపాయల వరకు సులభమైన ప్లాన్స్

BSNL Offers: రూ.229లో బిఎస్ఎన్ఎల్ అద్భుతమైన ప్లాన్.. రోజుకు 2జిబి డేటా, నెలపాటు అన్‌లిమిటెడ్ కాల్స్

Gold rate: అయ్యయ్యో.. తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

Amazon Diwali Offers: అమెజాన్ దీపావళి స్పెషల్ ఆఫర్లు! 80% వరకు తగ్గింపు, రూ.300 క్యాష్‌బ్యాక్!

Big Stories

×