E-Paper
Advertisement

India To America: అమెరికాలో ఇండియన్ ఫోన్ల హవా.. చైనాకు చెక్.. ప్రతి 3 ఫోన్లలో ఒకటి మనదే!

India To America: అమెరికాలో ఇండియన్ ఫోన్ల హవా.. చైనాకు చెక్.. ప్రతి 3 ఫోన్లలో ఒకటి మనదే!
Advertisement

ఒకప్పుడు మేడిన్ అమెరికా, మేడిన్ జపాన్, మేడిన్ ఇంగ్లండ్ వస్తువులంటే మన దేశంలో భలే క్రేజ్. ఇప్పుడు ఆ దేశాలకు చెందిన కంపెనీలు కూడా మన దేశంలోనే ప్లాంట్లను పెట్టి ఇక్కడే వాటిని తయారు చేస్తున్నాయి. అంటే ఇప్పుడు ఆ పెద్ద పెద్ద కంపెనీలన్నీ మేడిన్ ఇండియా బ్రాండ్ ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నాయనమాట. తాజాగా ఇలాంటి ఎగుమతుల్లో భారత్ మరో పెద్ద మైలురాయిని అందుకుంది. అమెరికాకు ఎగుమతి అయ్యే ప్రతి 3 స్మార్ట్ ఫోన్లలో ఒకటి ఇండియాలో తయారైందే కావడం ఈ ఘనతకు కారణం. ఇప్పటి వరకు స్మార్ట్ ఫోన్ల ఎగుమతుల్లో చైనా టాప్ ప్లేస్ లో ఉండగా, దాన్ని రీప్లేస్ చేసేందుకు భారత్ దూసుకెళ్తోంది.

చైనాని వెనక్కు నెట్టిన భారత్..
2025 ప్రారంభం నుంచి ఎగుమతుల్లో భారత్ దూకుడుగా ఉంది. ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లో అమెరికాకు ఎగుమతి అయ్యే స్మార్ట్ ఫోన్లలో భారత్ వాటా 36 శాతానికి పెరిగింది. గతేడాది ఇది కేవలం 11 శాతం మాత్రమే. ఇక చైనా గతేడాది 82 శాతం ఫోన్లను అమెరికాకు ఎగుమతి చేయగా, ఈ ఏడాది ఆ పర్సంటేజ్ 49 దగ్గర ఆగిపోయింది. అంటే భారత్, చైనాను వెనక్కు నెట్టేందుకు ఎంతోకాలం ఆగాల్సిన పనిలేదనమాట.

Advertisement

యాపిల్ టాప్..
భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న స్మార్ట్ ఫోన్లలో యాపిల్ కంపెనీ ఫోన్లు టాప్ ప్లేస్ లో ఉన్నాయి. విలువ పరంగా యాపిల్ ఫోన్లు ఎక్కువ శాతం ఆక్రమించాయి. అయితే ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ బాంబు పేల్చారు. భారత్ లో తయారు చేసిన ఐఫోన్‌లను అమెరికాలో అమ్మితే 25 శాతం సుంకం విధిస్తానని హెచ్చరించారు. ఆయన హెచ్చరిక ప్రభావం ఇంకా మన ఎగుమతులపై పడలేదు. అదే సమయంలో యాపిల్ కంపెనీ ఇండియాని అత్యంత నమ్మకమైన తయారీ కేంద్రంగా భావిస్తోంది. భారత్ లో తయారీని మరింత వృద్ధి చేస్తోంది. ఏప్రిల్ నుంచి మొదలు పెడితే అమెరికాలో అమ్ముడవుతున్న ఐఫోన్లు ఎక్కువగా భారత్ నుంచే వెళ్లాయి. ప్రపంచ వ్యాప్తంగా 100 ఐ ఫోన్లు తయారైతే అందులో 20 ఫోన్లు ఇండియాలోనే తయారు చేస్తోంది యాపిల్ కంపెనీ. ఇంతకు ముందు చైనాలో ఎక్కువ ఫోన్లు తయారు చేస్తే, ఇప్పుడా స్థానం భారత్ ఆక్రమిస్తోంది.

ఇండియా చొరవ..
అమెరికా ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిషన్ (USITC) డేటా ప్రకారం, ఈ ఏడాది మే నెల వరకు అమెరికాకు వెళ్లే భారత స్మార్ట్ ఫోన్ల ఎగుమతులు మూడు రెట్లు పెరిగి 21.3 మిలియన్ యూనిట్లకు చేరుకున్నాయి. విలువ ఆధారంగా ఈ మొత్తం 182 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. అంటే అది 9.35 బిలియన్ డాలర్లు అన్నమాట. దేశీయంగా స్మార్ట్‌ఫోన్‌ల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం తీసుకున్న చొరవ ఫలితం ఇది అని అంటున్నారు. 2014-15తో పోల్చి చూస్తే నేడు భారతదేశంలో మొబైల్ ఫోన్ల ఉత్పత్తి 28 రెట్లు పెరిగింది. మొబైల్ ఫోన్ల విలువ రూ.5.45 లక్షల కోట్లకు చేరుకోవడం విశేషం. ఎగుమతులు 127 రెట్లు పెరిగి 2 లక్షల కోట్లకు చేరుకున్నాయి.

Related News

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

పసిడి ప్రియులకు పండగే.. నేడు మళ్లీ దిగివచ్చిన ధరలు.. ఎంత తగ్గిందంటే?

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. నిన్న పెరిగిన పసిడి ధరలకు నేడు బ్రేక్.. తాజా రేట్లు ఇవే!

గుడ్ న్యూస్.. సిలిండర్ అయిపోయిందా? టెన్షన్ వద్దు, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో ఆర్డర్ చేయండి!

Big Stories

Advertisement
×