BigTV English

Virat Kohli: RCBకి ఎదురుదెబ్బ.. కోహ్లీ షాకింగ్ నిర్ణయం… అగ్రిమెంట్ రద్దు!

Virat Kohli: RCBకి ఎదురుదెబ్బ.. కోహ్లీ షాకింగ్ నిర్ణయం… అగ్రిమెంట్ రద్దు!

Virat Kohli:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కంటే ముందు ఊహించని పరిణామం ఎదురైంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు విరాట్ కోహ్లీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వచ్చే సీజన్ లో విరాట్ కోహ్లీ ఆడబోడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన అగ్రిమెంట్ ను విరాట్ కోహ్లీ రెన్యువల్ చేసుకోలేదని తెలుస్తోంది. ప్రతి ఏడాది ఈ రెన్యూవ‌ల్ అగ్రిమెంట్ పైన విరాట్ కోహ్లీ సంతకం చేస్తాడు. కానీ ఈ సారి మాత్రం విరాట్ కోహ్లీ ఈ అగ్రిమెంట్ పైన సంతకం చేయలేదని తెలుస్తోంది. దీంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇవ్వబోతున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ వార్త బయటకు రావడంతోనే విరాట్ కోహ్లీ అభిమానులు ఉలిక్కి పడుతున్నారు.


Also Read: Yashasvi Jaiswal Century: యశస్వి జైస్వాల్ సూప‌ర్ సెంచ‌రీ..స‌చిన్ రికార్డు బ‌ద్ద‌లు,భారీ స్కోర్ దిశ‌గా టీమిండియా

ఐపీఎల్ కు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటుకు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు సంబంధించిన అగ్రిమెంట్ పై కోహ్లీ ఇప్ప‌టి వ‌ర‌కు సంతకం చేయలేదని స‌మాచారం. ప్రతి ఏడాది తాను తీసుకునే అమౌంట్ కు సంబంధించిన అగ్రిమెంట్ పై సంతకం చేస్తాడు కోహ్లీ. కానీ ఈ సారి ఇప్ప‌టి వ‌ర‌కు చేయలేద‌ట‌. సంత‌కం చేయ‌మ‌ని అడిగితే, కోహ్లీ ఫోన్ లిఫ్ట్ చేయ‌డం లేద‌ని అంటున్నారు. దీంతో వ‌చ్చే సీజ‌న్ లో కోహ్లీ ఉండ‌డ‌ని అంటున్నారు. రిటైర్మెంట్ తీసుకునేందుకు సిద్ధం అయ్యార‌ని విరాట్ కోహ్లీపై వార్త‌లు వ‌స్తున్నాయి.


ప్రతి ఏడాది విరాట్ కోహ్లీకి 21 కోట్ల చొప్పున రెమ్యూనరేషన్ ఇస్తోంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. గతంలో 15 కోట్ల వరకు మాత్రమే రెమ్యూనరేషన్ తీసుకున్నాడు విరాట్ కోహ్లీ. కానీ ఐపీఎల్ 2025 టోర్నమెంటు నుంచి విరాట్ కోహ్లీకి 21 కోట్ల చొప్పున ఇస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ అగ్రిమెంట్ పైనే విరాట్ కోహ్లీ సంఘటన చేయలేదని తెలుస్తోంది. ప్రస్తుతం లండన్ లోనే ఉంటున్న విరాట్ కోహ్లీ.. కేవలం వన్డేలలో మాత్రమే ఆడుతున్నాడు.

ఇప్పటికే టెస్టులు అలాగే టీ20 లకు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా వన్డే సిరీస్ అనంతరం పూర్తిగా అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ఇస్తాడని వార్తలు వస్తున్నాయి. అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కు కూడా గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నాడని సమాచారం అందుతుంది. ఇది ఇలా ఉండగా దాదాపు 18 సంవత్సరాల తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ గెలుచుకుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. ఆ 18 సంవత్సరాలలో కూడా రాయల్ చాలెంజెస్ బెంగళూరు జట్టులోనే ఆడాడు విరాట్ కోహ్లీ. ఇక జట్టు టైటిల్ గెలవడంతో రిటైర్మెంట్ గా సిద్ధమైనట్లు చెబుతున్నారు.

Also Read: IND-W vs SA-W: రీల్స్ పైన ఉన్న ఫోకస్, బ్యాటింగ్ పైన లేదు…లేడీ కోహ్లీ అనుకుంటే, నట్టేట ముంచింది!

 

Related News

Rahkeem Cornwall Helmet: జ‌స్ట్ మిస్‌… బుల్లెట్ లా దూసుకొచ్చిన బంతి…హెల్మెట్ లో ఇరుక్కుని మ‌రి..!

Smriti Mandhana: స్మృతి మందాన 28 ఏళ్ల‌ చ‌రికొత్త రికార్డు..1000 ప‌రుగులు క్రాస్, ఆసీస్ పై భారీ స్కోర్‌

Ind vs WI: 5 వికెట్ల‌తో చెల‌రేగిన‌ కుల్దీప్…మొద‌టి ఇన్నింగ్స్ లో విండీస్ ఆలౌట్‌..స్కోర్ వివ‌రాలు ఇవే

Mahika Sharma: 13 ఏళ్లలోనే షాహిద్ ఆఫ్రీదితో ఎ**ఫైర్‌.. బ‌య‌ట‌ప‌డ్డ‌ పాండ్యా కొత్త ల‌వ‌ర్ భాగోతం !

INDW vs AUSW: ఇవాళ ఆసీస్ తో బిగ్ ఫైట్‌..ఓడితే టీమిండియా ఇంటికేనా? పాయింట్ల ప‌ట్టిక ఇదే

Sai Sudharsan Catch: సాయి సుద‌ర్శ‌న్ స‌న్నింగ్ క్యాచ్‌..చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే..కానీ చివ‌ర‌కు

Roman Reigns vs Bronson reed: క్రికెట్ బ్యాట్ ప‌ట్టి చిత‌క‌బాదిన రోమన్ రీన్స్..బ‌లంగా బాదేసి మ‌రీ, కానీ చివ‌ర‌కు

Big Stories

×