Big Stories

Qantas: ఘోస్ట్ ఫ్లైట్స్ కుంభకోణంలో.. కాంటాస్ కు 66 మిలియన్ డాలర్ల ఫైన్

Qantas: ఆస్ట్రేలియా అతి పెద్ద విమానయాన సంస్థ కాంటాస్ క్యాన్సిల్ అయిన విమానాల్లోని సీట్లను విక్రయించింది. దీన్ని తప్పుబట్టిన ఆ దేశ నియంత్రణా సంస్థ కాంటాస్ కు రూ. 550 కోట్ల జరిమానా విధించింది. లాభాల కోసం అక్రమ విధానాలను అనుసరించిన కాంటాస్ చివరకు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

- Advertisement -

ఘోస్ట్ ప్లైట్స్ పేరుతో పిలబడుతున్న కుంభకోణంలో 66 మిలియన్ డాలర్ల జరిమానా చెల్లించడానికి కాంటాస్ సిద్ధమైంది. చాలా రోజులుగా ముందుగా రద్దయిన విమాన టికెట్లను కూడా కాంటాస్ అమ్ముతూ వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా అంగీకరించిందని ఆస్ట్రేలియా నియంత్రణా సంస్థ ప్రకటించింది. దీంతో 66 మిలియన్ డాలర్ల జరిమానాతో పాటు 86 వేల మంది ప్రయాణికులకు 13 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని నియంత్రణా సంస్థ ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -

కాంటాస్ తీరుపై నియంత్రణా సంస్థ అసంతృప్తి వ్యక్తం చేసింది. లాభాల కక్కుర్తితో కంపెనీ చేసిన పని ఏ మాత్రం సరైనది కాదని చివాట్లు పెట్టింది. సంస్థ నిర్వాకం వల్ల చాలా మంది వ్యాపారులు, పర్యటకులు రద్దు చేసిన విమానాల్లో టికెట్టు బుక్ చేసుకుని నష్టపోయారని వెల్లడించింది. తమ కస్టమర్లకు నష్టం కలిగించామని, మూడు రోజుల ముందు రద్దయిన విమానాల టికెట్లను కూడా విక్రయించాం, ప్రమాణాలను పాటించటంలో విఫలమయ్యాం,ప్రయాణికులకు సకాలంలో నోటిఫికేషన్లు పంపలేకపోయామని కాంటాస్ సీఈఓ వనెస్సా హడ్సన్ తమ తప్పును అంగీకరించారు.

Also Read: ప్రతిరోజూ రూ. 45 ఇన్వెస్ట్ చేస్తే.. రూ. 25 లక్షలు మీ సొంతం!

ఇదిలా ఉంటే 103 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ సంస్థ తీరుపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టికెట్ల ధరల పెంపకం, కరోనా సమయంలో ఉద్యోగుల తొలగింపు వంటి అంశాల్లో ఈ సంస్ధ తీవ్ర విమర్శలను ఎదర్కుంటుంది. గత ఏడాది ఈ సంస్థ 1.1 బిలియన్ డాలర్ల లాభాన్ని ఆర్జించింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News