E-Paper
Advertisement

AP Liquor: నకిలీ మద్యం కేసులో 11 మంది నిందితుల రిమాండ్ పొడిగింపు..

AP Liquor: నకిలీ మద్యం కేసులో 11 మంది నిందితుల రిమాండ్ పొడిగింపు..
Advertisement

AP Liquor: ఏపీలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసు.. ప్రస్తుతం విజయవాడ ఆరో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు నవంబర్ 6న 11 మంది నిందితుల రిమాండ్‌ను నవంబర్ 13 వరకు పొడిగించింది. ఈ నిందితులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరయ్యారు. ఈ కేసులో మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత జోగి రమేశ్, ఆయన సోదరుడు జోగి రాములతో పాటు మరో ముగ్గురు విజయవాడ జిల్లా జైలులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు.

అయితే ఈ కేసు 2023లో ప్రారంభమైంది. ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్ధన్‌రావు వీడియో స్టేట్‌మెంట్‌లో జోగి రమేశ్ ప్రమేయంతోనే నకిలీ మద్యం తయారీ, పంపిణీ జరిగిందని ఆరోపించాడు. జనార్ధన్‌రావు ఆఫ్రికా వెళ్లే ముందు జోగి ఇంటికి వచ్చి కలిసినట్టు, రూ.3 కోట్ల ఆర్థిక సహాయం హామీ ఇచ్చినట్టు చెప్పాడు. టీడీపీ-జేడీపీ-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఈ కేసు వేగం అయ్యింది. ఈ కేసులో ఇప్పటివరకు 23 మంది అరెస్టయ్యారు.

Advertisement

అంతేకాకుండా నవంబర్ 2 ఉదయం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో జోగి రమేశ్ నివాసానికి ఎక్సైజ్ సిట్, పోలీసులు చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. 12 గంటల సుదీర్ఘ విచారణ తర్వాత రాత్రి 1:45 గంటలకు కోర్టులో హాజరు. అర్ధరాత్రి దాటినా వాదనలు కొనసాగి, తెల్లవారుజామున 5 గంటలకు న్యాయమూర్తి నవంబర్ 13 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ముందు విజయవాడ సబ్ జైలు, తర్వాత నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలింపు.

Also Read: మరో రైలు ప్రమాదం.. స్పాట్‌లో ముగ్గురు మృతి, పలువురికి గాయాలు

Advertisement

ఈ ఘటనపై వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ అరెస్టును “రాజకీయ ప్రతీకారం” అని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు సొంత పార్టీ నేతల నకిలీ మద్యం కేసులను కప్పిపుచ్చుతున్నారని ఆరోపించారు. జోగి రమేశ్ దుర్గ మందిరంలో సత్య ప్రమాణం చేసి, లై డిటెక్టర్ టెస్ట్‌కు సిద్ధమని చెప్పారు. అరెస్టు రోజు హైకోర్టులో సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.

Related News

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

Big Stories

Advertisement
×