E-Paper
Advertisement

AP Liquor: నకిలీ మద్యం కేసులో 11 మంది నిందితుల రిమాండ్ పొడిగింపు..

AP Liquor: నకిలీ మద్యం కేసులో 11 మంది నిందితుల రిమాండ్ పొడిగింపు..
Advertisement

AP Liquor: ఏపీలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసు.. ప్రస్తుతం విజయవాడ ఆరో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు నవంబర్ 6న 11 మంది నిందితుల రిమాండ్‌ను నవంబర్ 13 వరకు పొడిగించింది. ఈ నిందితులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరయ్యారు. ఈ కేసులో మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత జోగి రమేశ్, ఆయన సోదరుడు జోగి రాములతో పాటు మరో ముగ్గురు విజయవాడ జిల్లా జైలులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు.

అయితే ఈ కేసు 2023లో ప్రారంభమైంది. ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్ధన్‌రావు వీడియో స్టేట్‌మెంట్‌లో జోగి రమేశ్ ప్రమేయంతోనే నకిలీ మద్యం తయారీ, పంపిణీ జరిగిందని ఆరోపించాడు. జనార్ధన్‌రావు ఆఫ్రికా వెళ్లే ముందు జోగి ఇంటికి వచ్చి కలిసినట్టు, రూ.3 కోట్ల ఆర్థిక సహాయం హామీ ఇచ్చినట్టు చెప్పాడు. టీడీపీ-జేడీపీ-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఈ కేసు వేగం అయ్యింది. ఈ కేసులో ఇప్పటివరకు 23 మంది అరెస్టయ్యారు.

Advertisement

అంతేకాకుండా నవంబర్ 2 ఉదయం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో జోగి రమేశ్ నివాసానికి ఎక్సైజ్ సిట్, పోలీసులు చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. 12 గంటల సుదీర్ఘ విచారణ తర్వాత రాత్రి 1:45 గంటలకు కోర్టులో హాజరు. అర్ధరాత్రి దాటినా వాదనలు కొనసాగి, తెల్లవారుజామున 5 గంటలకు న్యాయమూర్తి నవంబర్ 13 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ముందు విజయవాడ సబ్ జైలు, తర్వాత నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలింపు.

Also Read: మరో రైలు ప్రమాదం.. స్పాట్‌లో ముగ్గురు మృతి, పలువురికి గాయాలు

Advertisement

ఈ ఘటనపై వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ అరెస్టును “రాజకీయ ప్రతీకారం” అని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు సొంత పార్టీ నేతల నకిలీ మద్యం కేసులను కప్పిపుచ్చుతున్నారని ఆరోపించారు. జోగి రమేశ్ దుర్గ మందిరంలో సత్య ప్రమాణం చేసి, లై డిటెక్టర్ టెస్ట్‌కు సిద్ధమని చెప్పారు. అరెస్టు రోజు హైకోర్టులో సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×