E-Paper
Advertisement

Onion Export Restrictions: ఉల్లి రైతులకు శుభవార్త.. ఎన్నికల దృష్ట్యా ఎగుమతులపై ఆంక్షలు తొలగించిన కేంద్రం..

Onion Export Restrictions: ఉల్లి రైతులకు శుభవార్త.. ఎన్నికల దృష్ట్యా ఎగుమతులపై ఆంక్షలు తొలగించిన కేంద్రం..

Onion Export Restrictions| దేశంలోని ఉల్లి, బాస్మతి బియ్యం రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ముఖ్యంగా ఉల్లిపాయ ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని తొలగించింది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు ఉల్లి ఎగుమతి ధర ను కేంద్రం నియంత్రించింది. ఒక టన్ను ఉల్లి 550 డాల్లరు (దాదాపు రూ.46000) కనీస ధరకు విక్రయించాలని ఆంక్షలు ఉండేవి.

పైగా ఉల్లి ఎగుమతిపై గత ఏడాది ఆగస్టు లో కేంద్ర ప్రభుత్వం 40 శాతం పన్ను విధించింది. ఆ తరువాత 2023 డిసెంబర్ నుంచి ఈ సంవత్సరం మే వరకు ఉల్లి ఎగుమతులపై నిషేధం కూడా విధించింది. దీంతో దేశంలోని రైతులు ఎగుమతి చేయడానికి ఇబ్బందులు పడేవారు. ఆ తరువాత నిషేధం తొలగించి ఆంక్షలు విధించింది.

Also Read: రిటైర్మెంట్ తరువాత నెలకు రూ.లక్ష సంపాదన.. ఇలా ప్లాన్ చేసుకోండి సరిపోతుంది..

” ఉల్లి ఎగుమతికి కనీస ధర ఆంక్షలు వెంటనే తొలగించబడ్డాయి. ఈ మార్పు తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు కొనసాగుతాయి.” అని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ అధికారిక ప్రకటనలో పేర్కొంది.

దేశంలో మహారాష్ట్ర, హర్యాణాలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో ఉలి పండించే రైతులు భారీ సంఖ్యలో ఉన్నారు. ఎన్నికల ముందు రైతులను ప్రసన్నం చేసుకునేందుకే కేంద్రంలోని బిజేపీ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఎగుమతి చేయడానికి ఉల్లి ధరలపై కనీస ధరల ఆంక్షలు ఉండడంతో ఇతర దేశాలు భారత దేశం నుంచి ఉల్లి కొనడానికి వెనుకడుగు వేస్తున్నాయి. దీంతో రైతుల ధర తగ్గించి విక్రయించాలన్న ప్రభుత్వ ఆంక్షలు అడ్డుగా ఉండేవి. ఇప్పుడు ఎగుమతిపై ఆంక్షలు తొలగిపోవడంతో రైతులు ఆర్థికంగా లాభాలు పొందే అవకాశం ఉంది.

మరోవైపు దేశంలో ఉల్లి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఎగుమతులు పెరిగితే ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. కానీ దేశంలో ఉల్లి పంట ఈ సారి భారీగా ఉన్నందున మరో రెండు నెలల్లో కొత్త ఉల్లి అందుబాటులో రానుందని ధరలు నియంత్రణలోకి వస్తాయని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో దేశంలో ఉల్లి నిల్వలు 38 లక్షల టన్నులు ఉన్నట్లు ఆమె తెలిపారు.

Also Read: కౌంటర్‌లో కొన్న రైలు టికెట్‌ను ఆన్‌లైన్‌లో క్యాన్సిల్ చేసుకోవడం ఎలా? చాలా సింపుల్, ఇలా చెయ్యండి చాలు!

Related News

ప్రధాని నరేంద్రమోదీ ‘బంగారం’ మాటలు.. ఆపై గృహాలు, దేవాలయాల వంతు

ఆయిల్ తర్వాత గ్యాస్ వంతు మొదలు.. మరోసారి కమర్షియల్‌గా బాదుడు.. సిలిండర్‌కు రూ.42

బాలికలకు వరం… సుకన్య సమృద్ధి యోజనలో ఇలా పెట్టుబడి పెడితే మీ కూతురుకి 50 లక్షలు పక్కా

నెలలో ఏ తేదీన సిప్ వేస్తే ఎక్కువ లాభం… 30 ఏళ్ల అధ్యయనం చెప్పిన షాకింగ్ నిజం

క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ 5 పొరపాట్లు చేస్తే భారీ ఆర్థిక నష్టం తప్పదు

డాలర్లు అమ్మడం ద్వారా ఆర్‌బీఐకి లక్షల కోట్ల లాభం… రూపాయి విలువను కాపాడే వ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఇదే

దేశంలో ఇళ్ల ధరలకు రెక్కలు.. 24 శాతం వరకు పెరుగుదల నమోదు, ఇక హైదరాబాద్‌ మాటేంటి?

బంగారం-వెండి ధరలు తగ్గుముఖం.. కొనుగోలు ఇదే సరైన సమయం, మార్కెట్లో ధరల మాటేంటి?

Big Stories

×