BigTV English
Advertisement

Train advance reservation: ట్రైన్ టికెట్ అడ్వాన్స్ రిజర్వేషన్.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్

Train advance reservation: ట్రైన్ టికెట్ అడ్వాన్స్ రిజర్వేషన్.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్

Train advance reservation| ఇండియన్ రైల్వే తాజాగా ట్రైన్ టికెట్ బుకింగ్ లో కొత్త నియమాలు తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఉన్న 120 రోజు అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ ని 60 రోజులకు తగ్గిస్తూ మార్పులు చేసింది. అంటే రిజర్వేషన్ లో రైలు ప్రయాణం చేయాలని భావించేవారు 60 రోజులు ముందస్తుగా టికెట్ బుక్ చేసుకోగలరు. ఇంతకుముందు ఈ సౌలభ్యం 120 రోజులు ఉండగా.. దాన్ని రైల్వే శాఖ 60 రోజులకు తగ్గించింది. నియమాలలో ఈ మార్పులు నవంబర్ 1 2024 నుంచి అమలులోకి వస్తాయి.


అయితే ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్నవారికి ఏ ఇబ్బందులు ఉండవు. వారి రిజర్వేషన్ చెల్లుబాటు అవుతుంది. భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకారం.. అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ (Advance Reservation Period – ARP) లో ఈ మార్పులు ప్యాసింజర్ల వసతి కోసమే చేయబడింది. ఎందుకంటే 21 శాతం ప్యాజింజర్లు టికెట్ రిజర్వేషన్ 120 రోజులు ముందుగానే చేసుకొని ఆ తరువాత టికెట్ క్యాన్సిల్ చేసుకుంటున్నారు. మరో 5 శాతం ప్రయాణికులు రిజర్వేషన్ చేసుకున్నా.. ప్రయాణం చేయకుండా టికెట్ వృధా చేసుకుంటున్నారు. దీంతో ప్రయాణం అవసరం, అత్యవసరం ఉన్న ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ మార్పుల్లో ఈ 5 కీలకం
1. రైల్వే మంత్రిత్వ శాఖ చేసిన అడ్వాన్స్ రిజర్వేషన్ మార్పులు విదేశి ప్రయాణికులకు వర్తించదు. విదేశీయులు 365 రోజులు ముందుగానే అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకోవచ్చు.


2. తాజ్ ఎక్స్ ప్రెస్, గోమతి ఎక్స్ ప్రెస్ లాంటి కొన్ని పగటి పూట ప్రయాణించే ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కూడా అడ్వాన్స్ రిజర్వేషన్ పరిమితులు వర్తిస్తాయి.

3. అక్టోబర్ 31 2024 వరకు 120 రోజుల అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ టికెట్లు చెల్లుబాటు అవుతాయి. అయితే 60 రోజుల కంటే ముందుగా చేసుకున్న రిజర్వేషన్ టికెట్లు కొత్త నియమాల ప్రకారం.. వెసులబాటుని బట్టి రద్దు కూడా చేసే అవకాశం ఉంది.

4. టికెట్ 120 రోజులు ముందస్తుగా రిజర్వేషన్ లో బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు కొంతమంది టికెట్లు రద్దు చేయకుండా ప్రయాణం మానేస్తున్నారు. దీనివల్ల వారి స్థానంలో కొంత మంది వేరే వ్యక్తులు ప్రయాణం చేస్తున్నారు. నియమాల ప్రకారం.. ఇలా చేయడానికి అనుమతులు లేవు.

5. 1995-98 మధ్య అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ 30 రోజుల పరిమితి మాత్రమే ఉండేని రైల్వే శాఖ గుర్తు చేస్తూ.. కొత్త నియమాల ప్రయాణికులకు ఇబ్బందులు ఉండవని స్పష్టం చేసింది.

పరిమితికి మించి లగేజ్ తీసుకొని వస్తే ఫైన్ చెల్లించాలి
మరోవైపు రైల్వే శాఖ పరిమితికి మించి లగేజి తీసుకొని వస్తే.. ప్రయాణికులు తగిన ఫైన్ చెల్లించాల్సి వస్తుందని తెలిపింది. ఈ మేరకు వెస్ట్రన్ రైల్వే బుధవారం అక్టోబర్ 30 2024న ఒక ప్రకటన జారీ చేసింది. రైల్వేలో ఏ తరగతిలో ప్రయాణించినా.. వారి పరిమితి ప్రకారమే ఉచిత లగేజ్ తీసుకొని రావాలని.. అంతుకుమించి తీసుకొని వస్తే.. భారీ జరిమానా విధిస్తామని తెలిపింది. అధిక లగేజి వల్ల ప్రయాణికుల అసౌకర్యంతో పాటు రైల్వే స్టేషన్ లో రద్దీ ఎక్కువ అవుతోందని.. ఈ కారణంగానే లగేజిపై ఫైన్ విధిస్తున్నట్లు స్పష్టం చేసింది.

అయితే ఉచిత లగేజిలో కూడా పరిమిత సైజు కంటే పెద్ద ఆకారంలో ఉన్న లగేజి కూడా అనుమతించేది లేదని వెల్లడించింది. ఉదాహరణకు ప్రయాణికులు స్కూటర్లు, సైకిళ్లు తీసుకొని రైలు ప్రయాణం చేయరాదు. లగేజీ సైజు 100 cm x 100 cm x 70 cm కంటే పెద్దది గా ఉంటే దానిపై ప్రయాణికుడు ఫైన్ చెల్లించాలి. దీంతోపాటు రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించడానికి ప్రయాణికులు ట్రైన్ సమయం ప్రకారమే లోపలికి రావాలని కోరింది.

Related News

JioMart Offers: జియో మార్ట్‌ ఆఫర్లు రేపటితో లాస్ట్.. ఫ్రీ హోమ్ డెలివరీతో గ్రాసరీ వెంటనే కొనేయండి

Earbuds At Rs 749: ఫ్లిప్‌కార్ట్‌లో మాస్ ఆఫర్.. రూ.749లకే అద్భుతమైన బ్లూటూత్ ఇయర్‌బడ్స్

Amazon November 2025 Offers: రూ.25వేలలోపే డబుల్‌ డోర్‌ ఫ్రిజ్‌ .. ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ కూడా ఉంది బ్రో..

Suzuki Hayabusa 2025: లాంగ్ జర్నీకి నో టెన్షన్.. హై స్పీడ్‌తో దూసుకువస్తోన్న సుజుకి హయబూసా బైక్..

Gold Rate: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

EPFO Withdrawal: ఈపీఎఫ్ఓ విత్ డ్రా నిబంధనలతో కొత్త చిక్కులు.. కాలపరిమితి పెంపుపై చందాదారుల్లో అసంతృప్తి

Elite Black Smartwatch: అమెజాన్‌ బంపర్‌ ఆఫర్‌.. రూ.9 వేల స్మార్ట్‌వాచ్‌ ఇప్పుడు కేవలం రూ.2,799లకే!

Fastest Electric Bikes: ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ బైక్‌లు, ఒక్కోదాని స్పీడ్ ఎంతో తెలుసా?

Big Stories

×