Aadhaar: ఆధార్ పేరు చెప్పనక్కర్లేదు. ఏదైనా పని నిమిత్తం ఇంట్లో నుంచి అడుగు తీసి బయట పెడితే కచ్చితంగా ఆధార్ ఉండాల్సిందే. మహిళల గురించి చెప్పనక్కర్లేదు. ఎక్కడికి వెళ్లినా తప్పనిసరిగా దాన్ని తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఆధార్ గురించి కీలక అప్ డేట్స్ ఇచ్చింది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI.
ఆధార్కు సంబంధించి ఎప్పుడు అప్డేట్స్ వచ్చినా ప్రజలను అలర్ట్ చేస్తూ ఉంటుంది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI. తాజాగా చిన్నారులకు సంబంధించి కీలక సమాచారం వెల్లడించింది. 5 నుంచి 17 ఏళ్ల వయస్సు పిల్లలకు ఆధార్ బయోమెట్రిక్ సెప్టెంబర్ 30 వరకు ఉచితంగా ఉంటుందని తెలిపింది.
ఈ గడువు లోగా ప్రక్రియను ఉచితంగా పూర్తి చేసుకోవాలని తల్లిదండ్రులకు సూచన చేసింది. పిల్లలకు ఐదేళ్లు నిండినప్పుడు, 15 ఏళ్ల వయస్సులో తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్డేట్ చేయించాలని స్పష్టంచేసింది. ఈ ప్రక్రియను సకాలంలో పూర్తి చేసేలా చూడాలని కోరింది.
స్కూల్ అడ్మిషన్లు, ఎగ్జామ్స్, స్కాలర్షిప్లు, ప్రభుత్వ పథకాలు పొందేందుకు పిల్లలు తమ గుర్తింపును ధృవీకరించుకోవడానికి వీలు కల్పించడమే అప్డేట్ యొక్క లక్ష్యమని పేర్కొంది. సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని సందర్శించి పూర్తి చేయాలని పేర్కొంది. నార్మల్గా ఐదేళ్ల లోపు పిల్లల ఆధార్ నమోదు సమయంలో వివరాలు, ఫోటోను తీసుకుంటారు.
ALSO READ: రూ. 5 కోట్లు, రూ.10 కోట్లు.. హ్యాపీ రిటైర్మెంట్ కోసం బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి?
వేలిముద్రలు-ఐరిస్ స్కాన్లను నమోదు చేయకపోవడంతో అందుకు కారణం. అందుకే ఐదేళ్లు నిండిన చిన్నారులకు బయోమెట్రిక్ సమాచారాన్ని అందించాలని నిర్ణయించింది. ఆ తర్వాత 15 ఏళ్లు వయస్సులో మరోసారి ఆధార్ బయోమెట్రిక్ అప్ డేట్ చేయాలని పేర్కొంది. దేశంలో ఆధార్ కున్న ప్రాముఖ్యత గురించి చెప్పనక్కర్లేదు. ఆధార్ ద్వారా ప్రభుత్వ సేవలు, పథకాలకు ఉపయోగపడుతుంది.
UIDAI has achieved a significant milestone in its nationwide mission-mode drive for Mandatory Biometric Updates (MBU), completing over 20 million (over 2 crore) MBUs for school children across the country.
The initiative was enabled by UIDAI’s technological integration with the… pic.twitter.com/hB8l8h2AER
— Aadhaar (@UIDAI) August 19, 2026