Gold-Silver Price: పశ్చిమాసియాలో నెలకున్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో బంగారం-వెండి ధరలు భారీగా పతనం అవుతున్నాయి. గడిచిన రెండు పెరిగిన ఈ లోహాల ధరలు భారీగా పెరిగాయి. దీంతో సామాన్యుల దృష్టి అటు వైపు పడింది. గతరాత్రి ఎంసీఎక్స్ మార్కెట్ ప్రారంభంలో బంగారం-వెండి ధరలు 2 నుంచి 5 శాతం వరకు పతనమయ్యాయి. చివరకు మెల్లగా కోలుకుంది. దీంతో శుక్రవారం దేశీయ మార్కెట్లో వాటి ధరలు ఎలా ఉంటాయోనని ఆలోచన పడ్డారు సగటు మానవుడు.
అంతర్జాతీయ మార్కెట్లో పడిన బంగారం-వెండి ధరలు
ఇరాన్పై అమెరికా నాన్చుడి ధరణి వ్యవహరించడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఫలితంగా మదుపరులు చమురు కంపెనీలపై దృష్టి సారించారు. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో గురువారం క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. డాలర్ పుంజుకోవడం మొదలైంది. ఫలితంగా గోల్డ్, సిల్వర్ ఎంపీఎక్స్ మార్కెట్లో ఆదిలో బంగారం ధరలు భారీ పడిపోయాయి.
బంగారం 2 శాతం, సిల్వర్ 6 శాతం వరకు పడిపోయాయి. అర్ధరాత్రి మార్కెట్ ముగిసే సమయానికి మెల్లగా కొలుకుంది. ఈ ఉదయం ఆసియా మార్కెట్లు ప్రారంభమయ్యాయి. ఆదిలో బంగారం ధరలు అమాంతంగా పెరిగాయి. సిల్వర్ ధర పతనమైంది. దీంతో దేశీయ మార్కెట్లో శుక్రవారం రెండు లోహాల ధరలు పెరుగుతాయా? పతనం అవుతాయా? అనే ఆలోచన అప్పుడే మదుపరుల్లో మొదలైంది.
శుక్రవారం మార్కెట్పై మదుపరుల దృష్టి? పెరుగుతుందా? తగ్గుతుందా?
హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.2120 మేర పడి రూ.1,44,550 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర 10 గ్రాములు రూ.1950 మేర పడి రూ.1,32,500 వద్దకు దిగింది.శుక్రవారం మార్కెట్ ఆధారంగా ధరలు హెచ్చుతగ్గులు ఉంటాయి. ఇక వెండి ధరల విషయానికి వద్దాం. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.2,60,000 వద్ద ఉంది. ఇవాళ మార్కెట్ ఆధారంగా పెరిగిందని లేకుంటే తగ్గేది తెలియనుంది.