Gold ETF Investment:ఈ ఏడాదిలో బంగారం ధరలు 60% వరకు పెరిగాయి. ధరలు పెరగడంతో పెట్టుబడిదారులను బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు, ముఖ్యంగా డిజిటల్ రూపంలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ‘ డిజిటల్ గోల్డ్ లేదా ఇ-గోల్డ్ ఉత్పత్తుల’లో పెట్టుబడులపై సెబీ హెచ్చరికల నేపథ్యంలో ఇన్వెస్టర్లు సెబీ-రిజిస్టర్డ్ మధ్యవర్తుల అందించే గోల్డ్ ఈటీఎఫ్ లలో పెట్టుబడి పెట్టాలని యోచిస్తు్న్నారు.
మ్యూచువల్ ఫండ్స్ అందించే గోల్డ్ ఈటీఎఫ్లు స్టాక్ మార్కెట్లలో ఆర్థిక సాధనాలు, పెట్టుబడిదారులు వీటితో గోల్డ్ పొందేందుకు అవకాశం ఉంటుంది. ఫండ్ హౌస్లు రూ.1.02 లక్షల కోట్ల మొత్తంతో 22 క్యారెట్ల బంగారు ఈటీఎఫ్ లను అందిస్తున్నాయి. ఈటీఎఫ్ లు అక్టోబర్లో రూ.7,743 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. వరుసగా మూడో నెలలో కూడా బంగారు ఈటీఎఫ్ లలోకి పెట్టుబడులు కొనసాగాయి. గోల్డ్ ఏయూఎమ్ వ్యాల్యూ రూ.1 లక్ష కోట్ల మార్కును దాటింది. బంగారంపై పెట్టుబడులకు మరో అవకాశం ‘సావరిన్ గోల్డ్ బాండ్లు’ (SGBలు). వీటిని ప్రభుత్వం నిలిపివేసే అవకాశం ఉంది.
1. బంగారం ఈటీఎఫ్ లో పెట్టుబడి పెట్టడానికి ఏదైనా మ్యూచువల్ ఫండ్ను ఎంచుకోవచ్చు. ఇవి బంగారం ధరల తరహాలోనే పెరుగుతాయి.
2. స్టాక్ మార్కెట్లో వీటిని కొనుగోలు చేయవచ్చు, అమ్మవచ్చు. అయితే మీకు డీమ్యాట్ అకౌంట్ ఉండాలి.
3. ఈటీఎఫ్ విక్రయాలు, మూలధన లాభం ఇండెక్సేషన్ లేకుండా 12.5% వరకు పన్ను విధించే అవకాశం ఉంది.
4. ఫిజికల్ గోల్డ్ లో పెట్టుబడి పెట్టడం కంటే ఈటీఎఫ్ లలో పెట్టుబడి పెట్టడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దీనికి ఎటువంటి నిల్వ ఖర్చు లేదా భద్రత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లోని సమాచారం పూర్తిగా ఇంటర్నెట్ ఆధారితం. ఏదైనా పెట్టుబడికి సంబంధించిన నిర్ణయం తీసుకునే ముందుగా సెబీ రిజిస్టర్డ్ పెట్టుబడి సలహాదారుడిని సంప్రదించండి.