E-Paper
Advertisement

పసిడి ప్రియులకు ఊరట.. స్వల్పంగా తగ్గిన ధర, ఇవాళ మార్కెట్లో ఎలా ఉన్నాయంటే..

పసిడి ప్రియులకు ఊరట.. స్వల్పంగా తగ్గిన ధర, ఇవాళ మార్కెట్లో ఎలా ఉన్నాయంటే..
Advertisement

Gold prices Today: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు వేళ బులియన్ మార్కెట్‌పై ప్రభావం కనిపిస్తోంది. దీనికితోడు అంతర్జాతీయంగా చోటు చేసుకున్న ఈ పరిణామాల కారణంగా బంగారం ధరలు కిందకు దిగి వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లతోపాటు దేశీయ మార్కెట్లో బంగారం-వెండి ధరలను ఒక్కసారి పరిశీలిద్దాం.

దిగొస్తున్న పసిడి ధరలు

పసిడి కొనుగోలుదారులకు స్వల్ప ఊరట లభించింది. గడిచిన రెండు రోజులు బంగారం-వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. మళ్లీ ఇప్పుడు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అటు వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరల పతనమయ్యాయి. గడిచిన రెండురోజులుగా 5 శాతానికి పైగా పతనం అయ్యింది. దీంతో ప్రస్తుతం 80 డాలర్ల దిగువకు చేరింది.

పసిడి ప్రియులకు ఊరట.. స్వల్పంగా తగ్గిన ధర

Advertisement

ఇక బంగారం విషయానికి వద్దాం. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 4100 డాలర్లకు చేరింది. మంగళవారంతో పోల్చితే 4050 డాలర్ల వద్ద కొనసాగుతోంది. సిల్వర్ రేటు 60 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి విలువ రూ. 95.38 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం దేశీయ మార్కెట్‌పై పడింది. పసిడి ధర స్వల్పంగా దిగొచ్చింది. ఉదయం 9 గంటల లోపు మాత్రమే.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయి?

తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్-విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 200 తగ్గింది. ప్రస్తుతం 10 గ్రాములకు రూ. 1,32,000 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ ధర రూ. 220 పతనమైంది. ప్రస్తుతం రూ. 1,44,000 వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో వెండి ధర అదే స్థాయిలో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కేజీకి రూ .2.35 లక్షల వద్ద కంటిన్యూ అవుతోంది. దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్వల్ప వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,44,140గా ఉంది. ముంబై, బెంగళూరు, కోల్‌కతా నగరాల్లో హైదరాబాద్ ధర కనిస్తోంది.

Advertisement

ALSO READ: యూపీఐ యూజర్లకు బ్యాడ్ న్యూస్.. రూ.2,000 దాటితే ఛార్జీల మోత.. రానున్న మార్పులివే!

Related News

బిజినెస్‌లో మంచి లాభాలు సంపాదించే పెద్ద పెద్ద కంపెనీల విజయ రహస్యం ఇదే

వడ్డీ రేట్లపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక ప్రకటన, లోన్లు తీసుకునేవారికి రిలీఫ్

యూపీఐ యూజర్లకు బ్యాడ్ న్యూస్.. రూ.2,000 దాటితే ఛార్జీల మోత.. రానున్న మార్పులివే!

100 పర్సెంట్ ప్యూర్ అంటూ మోసం.. డాబర్ కంపెనీ తేనె, నెయ్యి సహా పలు ప్రొడక్ట్స్‌పై నిషేధం..

పసిడి ప్రియులకు బిగ్ రిలీఫ్.. మార్కెట్లో తులం ధర ఎంత? ఇంకెందుకు ఆలస్యం

ఐఐటీ డిగ్రీ లేకుండానే నెలకు రూ.5 లక్షల ఆదాయం? బీటెక్ డ్రాప్‌అవుట్ సంపాదన ఎలాగంటే

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

Big Stories

Advertisement
×