E-Paper
Advertisement

దేశంలో ఇళ్ల ధరలకు రెక్కలు.. 24 శాతం వరకు పెరుగుదల నమోదు, ఇక హైదరాబాద్‌ మాటేంటి?

దేశంలో ఇళ్ల ధరలకు రెక్కలు.. 24 శాతం వరకు పెరుగుదల నమోదు,  ఇక  హైదరాబాద్‌ మాటేంటి?
Advertisement

India Housing Market: దేశంలో రియల్ ఎస్టేట్ క్రమంగా పుంజుకుంటోంది. ఈ ఏడాది జనవరి-మార్చి తొలి ట్రైమాసికంలో దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో గృహాల ధరలు సగటున 3 నుంచి 24 శాతం వరకు పెరిగాయి. అందులో బెంగళూరులో అత్యధిక పెరుగుదల నమోదు అయ్యింది. మరి హైదరాబాద్ మాటేంటి?

దేశంలో ఇళ్ల ధరలకు రెక్కలు.. 24 శాతం వరకు పెరుగుదల

Advertisement

అంతర్జాతీయ పరిణామాలు వెంటాడుతున్నా దేశంలో ఇళ్ల ధరలు ఏ మాత్రం తగ్గలేదు. ఎనిమిది ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలకు అమాంతం పెరుగుతున్నట్లు నివేదికలు వస్తున్నాయి. ఏకంగా 3 శాతం నుంచి 24 శాతం వరకు పెరిగినట్లు ప్రాప్ టైగర్ నివేదిక వెల్లడించింది. చదరపు అడుగు ధర రూ.9785 మేరా పలుకుతున్నట్లు అందులో ప్రస్తావించింది.

ఇళ్ల అమ్మకాల విషయంలో బెంగళూరు నగరం బలమైన వృద్ధి సాధించింది. ఈ సిటీలో ఇళ్ల విక్రయాలు ఏకంగా 33 శాతం మేరా పెరిగినట్టు ప్రస్తావించింది. ఆర్థిక రాజధాని ముంబైలో అయితే చదరపు అడుగు ధర 20 శాతం పెరిగింది. అక్కడ అడుగు రూ.15 వేలకు చేరినట్టు పేర్కొంది. ఢిల్లీలో కూడా ఇళ్ల ధరలు 18 శాతం పెరిగాయి. అక్కడ చదరపు అడుగు ధర రూ.9534కు చేరినట్లు ఆ రిపోర్టు చెబుతోంది.

Advertisement

హైదరాబాద్ సిటీలో 11 శాతం వరకు ఇళ్ల ధరలు పెరుగుదల

పుణెలో ఇళ్ల ధరలు 12 శాతం పెరగ్గా ఆ తర్వాత స్థానంలో హైదరాబాద్ నిలిచింది. మహానగరం హైదరాబాద్‌‌లో 2026 జనవరి నుంచి మార్చి తొలి త్రైమాసికంలో ఇళ్ల ధరలు భారీగా పెరిగాయి. ఇక్కడ ఇళ్ల ధరలు దాదాపు 11 శాతం పెరిగినట్టు స్థిరాస్తి కన్సల్టెంట్ ప్రాప్ టైగర్ సంస్థ ప్రస్తావించింది. హైదరాబాద్ సిటీలో చదరచగ అడుగు ధర రూ.10 వేల వరకు పలుకుతోందని ప్రస్తావించింది.

హైదరాబాద్‌లో 25 శాతం మేరా ఇళ్ల విక్రయాలు పెరిగినట్లు వెల్లడించింది. 2026 ఏడాది జనవరి-మార్చి తొలి త్రైమాసికంలో ఇళ్ల ధరలకు రెక్కలు వచ్చాయి. ఓ వైపు ఇళ్లకు డిమాండ్ పెరగడం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ధరలు ఆకాశాన్ని తాకాయి. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో దాని ప్రభావం చాలా రంగాలను ప్రభావితం చేస్తోంది.

ALSO READ: బంగారం-వెండి ధరలు తగ్గుముఖం.. కొనుగోలు ఇదే సరైన సమయం, మార్కెట్లో ధరల మాటేంటి?

చమురుతోపాటు సిమెంట్, స్టీల్ వంటి వాటి ధరలు భారీగా పెరిగాయి. దాని ప్రభావం కాస్త స్థిరాస్తి రంగంపై పడిందని చెబుతున్నారు. మిగతా నగరాలైన అహ్మదాబాద్‌-8 శాతం, కోల్‌కతా- 7, చెన్నై-3 శాతం మేర ఇళ్ల ధరలు పెరిగినట్టు పేర్కొంది. ఇళ్ల నాణ్యతకు కొనుగోలుదారులు అధిక ప్రయార్టీ ఇస్తున్నట్లు ఆ నివేదిక స్పష్టం చేసింది.

Related News

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

పసిడి ప్రియులకు పండగే.. నేడు మళ్లీ దిగివచ్చిన ధరలు.. ఎంత తగ్గిందంటే?

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. నిన్న పెరిగిన పసిడి ధరలకు నేడు బ్రేక్.. తాజా రేట్లు ఇవే!

గుడ్ న్యూస్.. సిలిండర్ అయిపోయిందా? టెన్షన్ వద్దు, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో ఆర్డర్ చేయండి!

ఏఐ సునామీ.. ఐబీఎంకు ఊహించని షాక్! గంటల్లోనే రూ. 6.7 లక్షల కోట్లు మాయం!

నెలకు రూ.15,000 జీతం వచ్చే వారు కూడా లక్షాధికారి ఎలా అవ్వచ్చు? 50-30-20 రూల్ అంటే ఏంటి?

Big Stories

Advertisement
×