Gold-Silver Prices: అంతర్జాతీయంగా వ్యతిరేక పవనాలు బంగారం-వెండి మార్కెట్లను తాకింది. దీంతో బంగారం, వెండి ధరలు పతనమయ్యాయి. ఈ ధరలు ఇంకా పతనం అవుతాయా? ఇక్కడితో ఆగుతుందా? దీనిపై మార్కెట్ వర్గాలు ఏమంటున్నాయి? కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయమా? అవుననే అంటున్నాయి.
మార్కెట్లో బంగారం-వెండి ధరలు తగ్గుముఖం
ఇరాన్-అమెరికా మధ్య ఒప్పందాలు, అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయాలు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందన్న వార్తల మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడి దారులు బంగారంపై తమ పెట్టుబడులను తగ్గించుకోవడం మొదలు పెట్టారు. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో మే 27న బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి.
ట్రేడింగ్ సమయంలో స్పాట్ గోల్డ్ 1.3 శాతం తగ్గింది. ఒక విధంగా చెప్పాలంటే మార్చి 27 తర్వాత బంగారం ధరలు అత్యంత కనిష్ట స్థాయికి చేరుకున్నట్లు చెబుతున్నారు. జూన్ డెలివరీకి సంబంధించి అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ నష్టాల్లో ముగిసింది. ఫ్యూచర్స్ ధరలు 1.2 శాతం తగ్గి ఔన్సుకు 4,448.40 వద్ద ముగిసింది. అటు వెండి ధరలు దాదాపు 3 శాతం తగ్గి ఔన్సుకు 74.96 డాలర్లకు పడి పోయింది.
కొనుగోలు ఇదే సరైన సమయం,మార్కెట్లో ధరల మాటేంటి?
గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ మేరకు.. రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,58,430 వద్ద ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం ధర రూ.1,45,240గా ఉంది. గురువారం ఉదయం హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,58,280గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం ధర రూ.1,45,090గా కొనసాగుతోంది.
మరో వైపు వెండి ధరలు పడిపోతున్నాయి. సిల్వర్ కిలోకు 100 రూపాయల మేరా తగ్గింది. రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2,84,900గా ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.2,89,900, బెంగళూరులో రూ.2,85,100 వద్ద కొనసాగుతోంది. ఇకహైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో కిలో వెండి ధర రూ.2,89,900గా ఉంది.
ALSO READ: 7.5 శాతం వడ్డీ… అదిరిపోయే ఈ పోస్ట్ ఆఫీసు స్కీమ్ గురించి తెలుసా ?