E-Paper
Advertisement

Hyderabad Postal: హైదరాబాద్ లో 24×7 స్పీడ్ పోస్ట్ బుకింగ్.. నైట్ షిఫ్ట్ ప్రారంభించిన పోస్టల్ శాఖ

Hyderabad Postal: హైదరాబాద్ లో 24×7 స్పీడ్ పోస్ట్ బుకింగ్.. నైట్ షిఫ్ట్ ప్రారంభించిన పోస్టల్ శాఖ

Hyderabad Postal: హైదరాబాద్ వాసులకు జనరల్ పోస్ట్ ఆఫీస్(GPO) గుడ్ న్యూస్ చెప్పింది. 24×7 స్పీడ్ పోస్ట్ బుకింగ్ కోసం నైట్ షిఫ్ట్ ప్రారంభించింది. స్పీడ్ పోస్ట్ లెటర్లను రాత్రి 8 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు కూడా బుక్ చేసుకోవచ్చని తెలిపింది. పగటిపూట రద్దీతో ఇబ్బంది పడే వారి కోసం ఈ సదుపాయం కల్పించింది.

రాత్రి 8 నుంచి ఉదయం 8 వరకు

అక్టోబర్ 15, 2025 నుంచి ఈ విధానం అమలు చేస్తున్నట్లు జీపీఓ తెలిపింది. రాత్రి 8 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు 24×7 స్పీడ్ పోస్ట్ బుకింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చింది.

24×7 స్పీడ్ పోస్ట్

ఈ నూతన విధానంతో ఎలాంటి అంతరాయం లేకుండా పోస్టల్ సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చీఫ్ పోస్ట్ మాస్టర్ తెలిపారు. రాత్రి లేదా పగలు ఏ సమయంలోనైనా స్పీడ్ పోస్ట్ డాక్యుమెంట్లను బుక్ చేసుకునేందుకు ఈ సేవలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నూతన 24×7 స్పీడ్ పోస్టల్ సేవను ఉపయోగించుకోవాలని హైదరాబాద్ జీపీఓ వినియోగదారులను కోరింది. నగరంలో పోస్టల్ కార్యకలాపాలలో పెంచేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.

యూఎస్ కు పోస్టల్ సర్వీసులు ప్రారంభం

అక్టోబర్ 15 నుంచి భారతదేశం అమెరికాకు అన్ని రకాల అంతర్జాతీయ పోస్టల్ సేవలను తిరిగి ప్రారంభించిందని కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ పరిధిలోని పోస్టల్ విభాగం మంగళవారం ప్రకటించింది.

“అక్టోబర్ 15, 2025 నుండి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (USA)కి అన్ని రకాల అంతర్జాతీయ పోస్టల్ సేవలను పునఃప్రారంభిస్తున్నట్లు” పోస్టల్ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇండియా పోస్ట్ అమెరికాకు షిప్‌మెంట్‌ల కోసం నూతన డెలివరీ డ్యూటీ పెయిడ్ (DDP) వ్యవస్థను తీసుకొచ్చింది. దీంతో వినియోగదారులు పారదర్శకంగా షిప్పింగ్‌తో పార్శిళ్లు, పత్రాలు, బహుమతులను పంపవచ్చు.

Also Read: BSNL Diwali Offer: బీఎస్ఎన్ఎల్ దీపావళి బొనాంజా ఆఫర్.. రూ.1కే కొత్త కనెక్షన్.. ఉచిత సిమ్, రోజుకు 2 జీబీ డేటా 

ఢిల్లీ, మహారాష్ట్ర సర్కిల్‌లలో విజయవంతంగా పరీక్షించిన తర్వాత, ఇండియా పోస్ట్ డెలివరీ డ్యూటీ పెయిడ్ (DDP) ప్రాసెసింగ్ కోసం ఒక కంప్లైంట్ మెకానిజమ్‌ను ఏర్పాటు చేసింది.

Related News

ప్రధాని నరేంద్రమోదీ ‘బంగారం’ మాటలు.. ఆపై గృహాలు, దేవాలయాల వంతు

ఆయిల్ తర్వాత గ్యాస్ వంతు మొదలు.. మరోసారి కమర్షియల్‌గా బాదుడు.. సిలిండర్‌కు రూ.42

బాలికలకు వరం… సుకన్య సమృద్ధి యోజనలో ఇలా పెట్టుబడి పెడితే మీ కూతురుకి 50 లక్షలు పక్కా

నెలలో ఏ తేదీన సిప్ వేస్తే ఎక్కువ లాభం… 30 ఏళ్ల అధ్యయనం చెప్పిన షాకింగ్ నిజం

క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ 5 పొరపాట్లు చేస్తే భారీ ఆర్థిక నష్టం తప్పదు

డాలర్లు అమ్మడం ద్వారా ఆర్‌బీఐకి లక్షల కోట్ల లాభం… రూపాయి విలువను కాపాడే వ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఇదే

దేశంలో ఇళ్ల ధరలకు రెక్కలు.. 24 శాతం వరకు పెరుగుదల నమోదు, ఇక హైదరాబాద్‌ మాటేంటి?

బంగారం-వెండి ధరలు తగ్గుముఖం.. కొనుగోలు ఇదే సరైన సమయం, మార్కెట్లో ధరల మాటేంటి?

Big Stories

×