E-Paper
Advertisement

India Revises Baggage Rules: ప్రయాణికులకు అలర్ట్.. కొత్త బ్యాగేజీ రూల్స్.. మహిళలకు 40 గ్రా. పురుషులకు 20 గ్రామ్స్

India Revises Baggage Rules: ప్రయాణికులకు అలర్ట్.. కొత్త బ్యాగేజీ రూల్స్.. మహిళలకు 40 గ్రా. పురుషులకు 20 గ్రామ్స్
Advertisement

India Revises Baggage Rules: విదేశాల నుంచి దేశానికి వచ్చే ప్రయాణికులకు కేంద్రం తీపి కబురు. విదేశాల నుండి వచ్చేవారు మహిళలు 40 గ్రాముల బంగారు ఆభరణాలను, పురుషుడు 20 గ్రాములను సుంకం లేకుండా తీసుకురావచ్చు. ఒకవిధంగా చెప్పాలంటే విదేశాల్లో ఉంటున్న భారతీయులకు ఇదొక శుభవార్త.

ట్రావెలర్స్‌కి నేటి నుంచి కేంద్రం కొత్త రూల్స్

Advertisement

కేంద్రం తీసుకొచ్చిన నిబంధనలతో దేశంలోకి మరింత బంగారం అందుబాటులోకి రానుంది. ఒకప్పుడున్న రూల్స్‌ని కాస్త సవరించింది. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే భారతీయులకు ఊహించని రిలీఫ్. కొత్త నిబంధనలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. దీనివల్ల ఏయే వస్తువులు ఎంత వరకు తెచ్చుకోవచ్చు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త బ్యాగేజీ రూల్స్ నేటి నుంచి (ఫిబ్రవరి 2-2026) నుంచి అమల్లోకి వచ్చాయి. విదేశాల నుంచి దేశానికి వచ్చే ప్రయాణికులకు చల్లటి కబురు చెప్పింది. మహిళలు 40 గ్రాములు, పురుషులు 20 గ్రాముల వరకు బంగారు ఆభరణాలను సుంకం లేకుండా తీసుకురావచ్చు. విదేశాల్లో ఏడాదికిపైగా ఉన్న భారతీయులు, భారత సంతతి వ్యక్తులకు మాత్రమే ఈ రూల్స్ కింద బంగారం తీసుకునిరావచ్చు.

Advertisement

ఉమెన్ 40 గ్రా.. మెన్  20 గ్రాముల బంగారం తేవచ్చు

ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ లేకుండా పైన పేర్కొన్న బంగారు ఆభరణాలు తెచ్చుకోవచ్చు. కేవలం మీ సొంత వాడకానికి తెచ్చుకునే ఆభరణాలకు వర్తిస్తుందని పేర్కొంది. అదే బంగారం బిస్కెట్లు, అమ్మడానికి తెచ్చే గోల్డ్ దీని పరిధిలోకి రాదని తేల్చి చెప్పింది.  ఈ విషయాన్ని కేంద్ర పరోక్ష పన్నులు- కస్టమ్స్‌ బోర్డు-సీబీఐసీ వెల్లడించింది.

గతంలో మహిళలు లక్ష రూపాయలు విలువ చేసే ఆభరణాలు, పురుషులు 50 వేల విలువైన ఆభరణాలు తెచ్చేవారు. దీనివల్ల మరింత బంగారం భారతీయులకు అందుబాటులోకి రావచ్చని బులియన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనివల్ల దేశీయంగా బంగారం కొనుగోలు చేసేవారి సంఖ్య తగ్గవచ్చని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ALSO READ: యూపీఐ యాప్ లో వేరే ఖాతాకు డబ్బులు కొట్టేశారా?.. ఇలా చేస్తే తిరిగొస్తాయ్

దీనికితోడు వస్తువుల లిమిట్ పెంచింది. విదేశాల నుంచి వచ్చేవారు 75 వేల విలువైన వస్తువులను కస్టమ్స్ డ్యూటీ లేకుండా తేవచ్చు. గతంలో ఇది 50 వేల రూపాయలు మాత్రమే ఉండేది. రెండేళ్ల లోపు వయసున్న పిల్లలకు మినహాయింపు అస్సలు పనికిరాదు. ​ఫారిన్ టూరిస్టులు తమ సొంత అవసరాల కోసం రూ. 25,000 విలువైన వస్తువులను వెంట తెచ్చుకోవచ్చు. ​18 ఏళ్లు నిండిన ప్రయాణికులు ఎవరైనా సరే పన్ను లేకుండా ఒక ల్యాప్‌టాప్‌ని తమ వెంట తెచ్చుకోవచ్చు. ప్రయాణంలో వ్యక్తిగత అవసరాల కోసం తీసుకొచ్చే పాత వస్తువులు దుస్తులు, ఇతర పరికరాలు ఎలాంటి సుంకం ఉండదు.

Related News

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

200 అప్లికేషన్లు, 15 ఇంటర్వ్యూలు ఫెయిల్.. చివరికి డిష్‌వాషింగ్ జాబ్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వ్యధ

Big Stories

Advertisement
×