BigTV English
Advertisement

India’s First Bullet Train BEML: గంటకు 250కిమి వేగంతో దూసుకోపోయే బుల్లెట్ ట్రైన్.. ఇండియాలో ఇదే ఫస్ట్!

India’s First Bullet Train BEML: గంటకు 250కిమి వేగంతో దూసుకోపోయే బుల్లెట్ ట్రైన్.. ఇండియాలో ఇదే ఫస్ట్!

India’s First Bullet Train BEML| భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ బెంగుళూరు నుంచి రాబోతోంది. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసే ఈ హై స్పీడ్ ట్రైన్ ముంబై – అహ్మదాబాద్ రైల్ కారిడార్ లో సర్వీస్ ప్రారంభమవుతుంది.


బెంగుళూరుకి చెందిన భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML) అనే రైల్ ట్రాన్స్ పోర్ట్ కంపెనీ ఈ ట్రైన్ తయారు చేయబోతున్నట్లు తెలిసింది. దేశంలో రైల్వే కోచ్ తయారు చేసే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసిఎఫ్) గంటకు 280 కిలోమీటర్లు వేగంతో ప్రయాణించే రెండు హై స్పీడ్ చెయిర్ కార్ ట్రైన్స్ (రైల్ కోచ్) తయారు చేసేందుకు సెప్టెంబర్ 5 టెండర్లు పిలిచింది. అయితే ఈ టెండర్ కు సెప్టెంబర్ 19 వరకే గడువు ఉండగా.. కేవలం బిఈఎంఎల్ మాత్రమే బిడ్ చేసింది. బిఈఎంఎల్ 8 కార్ ట్రైన్ సెట్లు రెండు చేసేందుకు ఈ బిడ్ కోసం ప్రపోజల్ సమర్పించింది.

ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ జెనెరల్ మెనేజర్ యు సుబ్బారావు మీడియాతో ఈ విషయంలో మాట్లాడారు. ఈ టెండర్ ప్రక్రియని త్వరలోనే పూర్తిచేస్తామని.. హై స్పీడ్ ట్రైన్లు బెంగుళూరులోని బిఈఎంఎల్ తయారు చేస్తుందని. ఈ బుల్లెట్ ట్రైన్ల తయారీ మరో రెండున్నర సంవత్సరాల్లో పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు.


ఒక్కో హై స్పీడ్ ట్రైన్ తయారీకి రూ.200 కోట్ల నుంచి రూ.250 కోట్ల వరకు ఖర్చు అవుతుందని.. ఈ ట్రైన్లు 508 కిలోమీటర్ల దూరం కలిగిన ముంబై – అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్ మార్గంలో ప్రయాణిస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఈ కారిడార్ నిర్మాణానికి రూ.1.1 లక్ష కోట్లు ఖర్చు చేస్తోందిన

Also Read: ఏడాది పాటు జియా ఎయిర్ ఫైబర్ ఫ్రీ.. దీపావళి స్పెషల్ ఆఫర్!

అయితే ఈ ముంబై – అహ్మదాబాద్ రైల్ కారిడార్ ఇంతకుముందు జపాన్ కు చెందిన బుల్లెట్ ట్రైన్లు తీసుకురావాలని కేంద్రం భావించింది. కానీ జపాన్ ట్రైన్లు తీసుకురావడమంటే భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో దేశీయంగా తయారీ చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. యూరోప్ ట్రైన్ల మాడల్ తీసుకొని బిఈఎంల్, మరో సంస్థ మేధా సర్వో డ్రైవ్స్ సంయుక్తంగా దేశంలో హై స్పీడ్ ట్రైన్లు తయారు చేయబోతున్నాయని జాతీయ మీడియా తెలిపింది.

వందే భారత్ ట్రైన్లలో ప్రపల్సన్ టెక్నాలజీని అందించిన మేధా సర్వో డ్రైవ్స్.. కొత్త బుల్లెట్ ట్రైన్లలో కూడా గంటకు 250 కిలోమీటర్ల వేగం అందించే ప్రపల్సన్ టెక్నాలజీని తయారు చేయబోతోంది. మరోవైపు బిఈఎంఎల్ ట్రైన్ కార్ చెయిర్లు నిర్మిస్తుంది.

అయితే దేశంలోనే తొలి బుల్లెట్ ట్రైన్ గా పేరొందిన ఈ ప్రాజెక్ట్ డిసెంబర్ 2026 కల్లా పూర్తవుతుంది. తొలి ట్రయల్స్ కూడా సూరత్ – బిలిమోరా సెక్షన్ లో జరుగుతాయి. తొలి బుల్లెట్ ట్రైన్ లో 3+2 సీటింగ్ తో సెవెన్ కార్ కోచ్ లు, ఒక 2+2 ఎగ్జిక్యూటివ్ కార్ కోచ్ లు ఉంటాయి. ఈ ట్రైన్ లో మొత్తం 174 మంది ప్యాసింజర్లు ప్రయాణించవచ్చు. ఈ హై స్పీడ్ ట్రైన్ల ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తి అయితే ఎక్కువ ప్యాసింజర్ సామర్థ్యం కలిగిన పెద్ద బుల్లెట్ ట్రైన్స్ భవిష్యత్తులో అందుబాటులో వచ్చే అవకాశముంది.

Related News

JioMart Winter Offer: జియోమార్ట్‌ భారీ వింటర్‌ ఆఫర్లు.. బియ్యం, సబ్బులు, మసాలాలు అన్నీ సగం ధరకే..

Luxury Mattresses: అమెజాన్‌లో లగ్జరీ మెట్రెస్‌పై భారీ తగ్గింపు.. ఈ ఆఫర్ మిస్ అవ్వకండి..

DMart Offers: నవంబర్ లో డిమార్ట్ క్రేజీ ఆఫర్లు, ఆ వస్తువులపై ఏకంగా 80% తగ్గింపు!

Gold Rate: గుడ్ న్యూస్.. నేడు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..

JioMart Offers: జియో మార్ట్‌ ఆఫర్లు రేపటితో లాస్ట్.. ఫ్రీ హోమ్ డెలివరీతో గ్రాసరీ వెంటనే కొనేయండి

Earbuds At Rs 749: ఫ్లిప్‌కార్ట్‌లో మాస్ ఆఫర్.. రూ.749లకే అద్భుతమైన బ్లూటూత్ ఇయర్‌బడ్స్

Amazon November 2025 Offers: రూ.25వేలలోపే డబుల్‌ డోర్‌ ఫ్రిజ్‌ .. ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ కూడా ఉంది బ్రో..

Suzuki Hayabusa 2025: లాంగ్ జర్నీకి నో టెన్షన్.. హై స్పీడ్‌తో దూసుకువస్తోన్న సుజుకి హయబూసా బైక్..

Big Stories

×