Jeep Compass Turbo : ఆటో మార్కెట్లోకి మారో కారు ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ కార్ల తయారీ సంస్థ జీప్ ఇండియా తమ కంపాస్ లైనప్లో మరో వేరియంట్ ప్రారంభించింది. ఈ కారు ఇంజన్లో మార్పులతో, ఈ కొత్త వేరియంట్ అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేసింది. జీప్ కంపాస్ గ్లోబల్ మార్కెట్లో 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ వేరియంట్ను తీసుకొచ్చింది. భారతీయ మార్కెట్ ఇప్పటికే జీప్ రాంగ్లర్, గ్రాండ్ చెరోకీ 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్తో అందుబాటులో ఉన్నాయి.
జీప్ కంపాస్ కొత్త 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 272 hp పవర్ అందిస్తుంది. 400 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ జీప్ కంపాస్ మోడల్ను అత్యంత శక్తివంతమైన వేరియంట్గా చేస్తుంది. జీప్ కంపాస్ ఈ యూనిట్ డైరెక్ట్ ఇంజెక్షన్, డ్యూయల్ VPT సెటప్ను కలిగి ఉంది. దీని కారణంగా ఈ కారు 6.3 సెకన్లలో 0 నుండి 100 kmph వేగాన్ని అందుకోగలదు. ఈ వేరియంట్ టాప్-స్పీడ్ 228 kmph. ఈ కారులో 300 ఎంఎం బ్రేక్ డిస్క్ కూడా ఉంది.
Also Read : ట్రయంఫ్ టైగర్ నుంచి రూ. 16 లక్షల బైక్.. ఒక్కసారి ఎక్కితే ఉంటది మామ!
జీప్ కంపాస్ భారతీయ మార్కెట్లో పెట్రోల్ లైనప్లో ప్రస్తుతం ఏ కారులో అందుబాటులో లేదు. అదే సమయంలో జీప్ ఇండియా తన పెట్రోల్ లైనప్ను మరోసారి దేశానికి తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు గత సంవత్సరం వార్తలు వచ్చాయి. ఈ కారు పెట్రోల్ వేరియంట్ దేశంలోకి వస్తే దాని పెట్రోల్ ఇంజన్ కొంచెం చిన్నదిగా ఉండవచ్చు.
Also Read : ఆటోమేటిక్ ఎస్యూవీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా.. తక్కువ ధరలో బెస్ట్ ఇవే!
ఈ కారును 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ను పొందవచ్చు. ఇది 185 hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. జీప్ కంపాస్ 2025లో భారతదేశంలో ఈ ఇంజన్ వేరియంట్ను తీసుకొచ్చే అవకాశం ఉంది. అంతే కాాకుండా రాబోయే కాలంలో జీప్ మెరిడియన్ కూడా ఈ ఇంజన్తో మార్కెట్ల్లోకి తీసుకురావచ్చు. దీనికి ముందు దీని ఫేస్లిఫ్ట్ వెర్షన్ మార్కెట్లోకి రానుంది. జీప్ మెరిడియన్ ఫేస్లిఫ్ట్ ఈ ఏడాది చివర్లో భారత మార్కెట్లోకి వస్తుంది.