E-Paper
Advertisement

Yes Bank Layoff’s: ఎస్ బ్యాంకులో భారీగా ఉద్యోగుల తొలగింపు.. రాబోయే రోజుల్లో మరింకొంత మందిపై వేటు

Yes Bank Layoff’s: ఎస్ బ్యాంకులో భారీగా ఉద్యోగుల తొలగింపు.. రాబోయే రోజుల్లో మరింకొంత మందిపై వేటు
Advertisement

Massive Layoff’s in Yes Bank: ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీల నుంచి మొదలుకుని బ్యాంకింగ్ సంస్థల వరకు లే ఆఫ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ అయిన ఎస్ బ్యాంక్ దాని సంస్థ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటిస్తుంది. ఈ మేరకు తాజాగా 500 మంది ఉద్యోగులపై వేటు వేసింది. ప్రైవేట్ సంస్థ అయిన ఎస్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మరికొన్ని రోజుల్లోను మరిన్ని లే ఆఫ్స్ ఉంటాయని తెలుస్తోంది.

ఎస్ బ్యాంక్ దాని వ్యయాన్ని తగ్గించుకునేందుకే ఉద్యోగాల తొలగింపు చేయాలని నిర్ణయించుకుంది. రానున్న రోజుల్లోను బ్యాంకులో మరిన్ని ఉద్యోగాల తొలగింపులు ఉంటాయని పేర్కొంది. కాగా ప్రస్తుతం తొలగించిన ఉద్యోగులకు 3 నెలల జీతానికి సమానంగా పరిహారాన్ని కూడా అందించినట్లు ప్రకటించింది. బ్యాంకుకు వ్యయం పెరుగుతుండడంతో ఖాతాదారులకు మంచి సేవలను అందించాలని, వాటాదారులకు పూర్తి సామర్ధ్యాన్ని అందించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్ బ్యాంకు వివరణ ఇచ్చింది.

Advertisement

కేవలం బ్యాంకు భవిష్యత్తు కోసం మాత్రమే ఉద్యోగుల తొలగింపు జరిగినట్లు పేర్కొంది. ఇక డిజటల్ బ్యాంకింగ్ వైపు వెళ్లేందుకు ఎస్ బ్యాంకు యోచిస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు మాన్యువల్ వర్కింగ్ కూడా తగ్గించాలనే ఉద్దేశ్యం ఉందని పలువురు నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులోను మరిన్ని ఉద్యోగాల తొలగింపు ఉంటుందని సంస్థ పేర్కొనడంతో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.

Also Read: 2024 Nissan X-Trail SUV: నిస్సాన్​ ఎక్స్​-ట్రయల్ లాంచ్‌కు సిద్ధం.. ఇక ఆ మోడళ్లకు గట్టి పోటీ తప్పదు..!

Advertisement

మరోవైపు గత ఆర్థిక సంవత్సరంలో ఎస్ బ్యాంకు నిర్వహణ ఖర్చులు పెరిగాయని సంస్థ ప్రకటించింది. దాదాపు 17 శాతం వరకు పెరిగినట్లు పేర్కొంది. 2023 నుండి 2024 వరకు ఉన్న ఆర్థిక సంవత్సరంలో 12 శాతంకి పైగా పెరిగాయి. 2024 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 3774 కోట్లు ఖర్చు చేయగా, 2023 ఆర్థిక సంవత్సరానికి రూ. 3363 కోట్లు సంస్థ ఖర్చు చేసినట్లు తెలిపింది. మరోవైపు ఈ ఏడాది ముగిసే వరకు 28,000 మంది ఉద్యోగుల ఉండగా అందులో నుండి 484 మంది ఉద్యోగులను హైర్ చేసుకుంది.

తాజాగా ఎస్ బ్యాంకు తన సంస్థ వ్యయాలను తగ్గించుకోవాలని డిజిటల్ బ్యాంకింగ్ పై దృష్టి పెట్టాలని భావిస్తుంది. ఇక ఎస్ బ్యాంకు స్టాక్స్ బీఎస్ఈలో రూ. 23.95తో పోల్చగా మంగళవారం వరకు రూ. 24.02 వద్ద ముగిసింది. ప్రస్తుతం ఎస్ బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ. 75, 258 కోట్లుగా ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఎస్ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్‌గా ప్రశాంత్ కుమార్ ఉన్నారు. అయితే ప్రశాంత్ బాధ్యతలు స్వీకరించిన 2020 ఏడాదిలోను ఈ విధంగానే పెద్ద మొత్తంలో లేఆఫ్ లు జరిగాయి.

Tags

Related News

Old Pension Scheme: ఓల్డ్ పెన్షన్ స్కీమ్.. కేంద్రం క్లారిటీ, వారే అర్హులు

ఆభరణాలకు పింక్ పేపరే ఎందుకు? దాని వెనుక ఉన్న రహస్యమేంటి?

ఆధార్, ఫోన్ నంబర్‌తో.. మీ UAN నంబర్‌ను క్షణాల్లో కనుక్కోండిలా

ఆషాడ వేళ పసిడి షాక్.. ఆశలకి బ్రేక్ వేస్తూ మళ్ళీ పైపైకి బంగారం ధరలు!

ఎల్పీజీ గ్యాస్‌కు చెక్.. ఇకపై ఇథనాల్‌తో కుకింగ్, కేంద్రం సన్నాహాలు మొదలు

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

Big Stories

Advertisement
×