E-Paper
Advertisement

Maganti Gopinath Mother: నా కొడుకును చంపింది వాళ్లే.. పోలీస్ స్టేషన్‌కు మాగంటి గోపీనాథ్ తల్లి

Maganti Gopinath Mother: నా కొడుకును చంపింది వాళ్లే.. పోలీస్ స్టేషన్‌కు మాగంటి గోపీనాథ్ తల్లి
Advertisement

Maganti Gopinath Mother: మాగంటి గోపీనాథ్ మృతిపై తల్లి మహానంద కుమారి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. సునీతపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆమె రాయదుర్గం పీఎస్ పరిధిలో ఫిర్యాదు చేశారు. మాగంటి గోపీనాథ్ మృతిపై అనుమానాలు ఉన్నాయని దీనిపై పూర్తి దర్యాప్తు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. మాగంటిని తాను చూడకుండా ఉండేందుకు సునీత కూతురు దిషిర ఏఐజీ ఆసుపత్రికి లేఖ ఇచ్చిందని మహానంద కుమారీ ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను అడ్డుకుని కేటీఆర్‌ను మాత్రం అనుమతించడంపై అనుమానం వ్యక్తం చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. రాయదుర్గం పోలీస్ స్టేషన్లో మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తల్లి మహానంద కుమారి సంచలన ఫిర్యాదు చేశారు. తన కుమారుడు గోపీనాథ్ మరణం చుట్టూ ఉన్న అనుమానాస్పద పరిస్థితులపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆమె పోలీసులను కోరారు. గచ్చిబౌలి AIG హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సమయంలో జరిగిన పరిణామాలు, వైద్య సిబ్బంది ప్రవర్తన, ఆసుపత్రి భద్రతా సిబ్బంది వ్యవహారం అన్నీ ప్రశ్నార్ధకంగా ఉన్నాయని మహానంద కుమారి తన పిర్యాదులో పేర్కొన్నారు.

Advertisement

గోపీనాథ్ మరణానికి ముందు, తర్వాత జరిగిన అన్ని ఘటనలలో అనేక అనుమానాలు ఉన్నాయని, తన కుమారుడు ఐసీయూలో ఉన్న సమయంలో తన కొడుకుని కలవడానికి ఆసుపత్రి అనుమతించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ దిషిరా (సునీత కుమార్తె) రాతపూర్వక ఆదేశాల మేరకు భద్రతా సిబ్బంది తనను ఆసుపత్రిలోకి అనుమతించలేదని పేర్కొన్నారు. అదే సమయంలో మంత్రి కేటీఆర్‌ను మాత్రం ఎటువంటి నిరోధం లేకుండా లోపలికి అనుమతించారని ఆమె ఆరోపించారు.

ఫిర్యాదులో ఆమె వైద్య నిర్లక్ష్యం అంశాన్ని కూడా ప్రస్తావించారు. గోపీనాథ్ కిడ్నీ తొలగింపు తర్వాత తగిన శ్రద్ధ చూపలేదని, డయాలసిస్ ప్రక్రియలో ఆలస్యం జరిగిందని ఆమె ఆరోపించారు. అలాగే గోపీనాథ్ అస్వస్థతకు గురైనప్పుడు గన్‌మెన్, భద్రతా సిబ్బంది సహాయం చేయడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు. ఈ నిర్లక్ష్యం, అవగాహనలోపం, ఆసుపత్రి వ్యవహారశైలే తన కుమారుడి మరణానికి కారణమని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

తన కుమారుడి మరణ తేదీ, సమయం, ఆసుపత్రి రికార్డులు, వైద్య నివేదికలపై కుటుంబానికి ఇప్పటికీ స్పష్టత లేదని మహానంద కుమారి పేర్కొన్నారు. మరణ కారణంపై స్పష్టత లేకుండా సర్టిఫికెట్లు జారీ చేయడం, చికిత్స వివరాలను దాచిపెట్టడం చాలా అనుమానాస్పదంగా ఉంది అని ఆమె అన్నారు. ఆసుపత్రి రికార్డులు, సీసీటీవీ ఫుటేజ్, వైద్య బృందం నివేదికలను వెంటనే సీజ్ చేసి నిజాలను వెలికితీయాలని పోలీసులను విజ్ఞప్తి చేశారు.

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×