E-Paper
Advertisement

NFBS Scheme: కన్నీరు తుడిచే స్కీమ్.. కుటుంబ యజమాని మరణిస్తే.. వెంటనే రూ.20,000 జమ!

NFBS Scheme: కన్నీరు తుడిచే స్కీమ్.. కుటుంబ యజమాని మరణిస్తే.. వెంటనే రూ.20,000 జమ!

NFBS Scheme: జాతీయ కుటుంబ ప్రయోజన పథకం అంటే ఎమిటి? దీన్ని ఎందుకు ప్రవేశ పెట్టారు దీనివలన కలిగే లాభాలు ఏమిటి? అనే వాటి గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఈ పథకంపై గురించి ప్రజల్లోఅవగాహన లేక చాలా మంది ప్రజలు దీని ద్వారా వచ్చే లాభాలను పోందలేక పోతున్నారు. తెలంగాణలో జాతీయ కుటుంబ ప్రయోజన పథకం(National Family Benefit Scheme) అనేది కుటుంబాన్ని పోషించే వ్యక్తి ఒక వేల అకస్మాత్తుగా మరణించినప్పుడు ఆ కుటుంబానికి కొంత ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. ఈ పథకం ద్వారా చనిపోయిన యజమాని కుటుంబానికి రూ.20,000 రూపాయల ఆర్థిక సాహయంను కేద్ర ప్రభుత్వం అదిస్తుంది. ఈ పథకం దేశ వ్యాప్తంగా అన్నీ రాష్ట్రాల్లో అమలులో ఉంది. ఈ పథకం తెలంగాణ రాష్ట్రంలో 2017 నుండి అమలులో ఉంది.

ఈ పథకం అప్లై చేసుకోవడానికి కావాలసిన అర్హతలు

జాతీయ కుటుంబ ప్రయోజన పథకంకు(NFBS) అప్లై చేసుకోవాలంటే కనీస వయస్సు 18 సంవత్సరాల నుండి, గరిష్ట వయస్సు 60 సంవత్సరాలుగా నిర్ధారించారు. దారిద్ర్యరేఖకు దిగువన (BPL) పేదవారై ఉండి కుటుంబ ఆదాయం సంవత్సరానికి 60,000 వేల కంటే తక్కువ ఆదాయం కలిగి ఉన్నవారిని దీనికి అర్హులుగా పేర్కోంటారు. అయితే కుటుంబాన్ని పోషించే వ్యక్తి ఒక వేల అనారోగ్య కారణంగా లేదా.. ఏదైన ప్రమాదం లేదా సహజ కారణాల వల్ల మరణిచి ఉండాలి. ఈ పథకానికి అప్లై చేసే టప్పుడు ముఖ్యంగా వ్యక్తి మరణం జరిగిన తేదీ నుండి 2 సంవత్సరాల లోపు ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోవాలి. చనిపోయిన వ్యక్తి మరణ దృవీకరణ పత్రంతో పాటు, కులం, ఆదాయ ద్రువీకరనణ పత్రాలు, కుటుంబ సభ్యుల ఆదార్ ఖార్డులు, రేషన్ కార్డు, మూడు ఫోటోలతోపాటు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతా వివరాలను జతపరచాలి.

Also Read: Mahesh Babu: అప్పుడు మాస్టర్ మహేష్ బాబు తీసుకున్న రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవుతారు..

75 రోజుల లోపు ఆర్థిక సహాయం

లబ్దిదారుడి పూర్తి పత్రాలతో వారి ప్రాంతంలో సంబంధిత గ్రామ సెక్రటరీ లేదా మున్సిపల్ అధికారులకు దరఖాస్తు సమర్పించాలి. అనంతరం వాటిని రెవెణ్యూ, తహసిల్ధార్, సంబందిత అధికారులు పరిశీలించి ఆమోదిస్తారు. అనంతరం వాటిని అధికారులు సెర్ప్ సీఈఓ కి పంపించగా వాటిని ఆమోదం పొందుతుంది. అనంతరం కుటుంబ సభ్యుడికి నామినీగా ఉన్నటువంటి వ్యక్తి ఖతాలో20,000 రూపాయలను జమచేస్తారు. ప్రభుత్వ నియమాల ప్రకారం సదారణంగా దరఖాస్తు సమర్పించిన తేదీ నుండి 75 రోజుల లోపు వారికి ఆర్థిక సహాయం అందించాలి. ఒక వేల అప్పటి లోపు సహాయం అందకపోతే, రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా స్థాయి కమిటీ తక్షణమే ఆమోదం ఇవ్వాలి. అయితే ఈ ప్రక్రియ పూర్తిగా డిజిటల్‌గా నిర్వహించబడుతుంది, తద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేయబడతాయి.

Also Read: BRS : మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎన్నో స్థానానికి పరిమితమంటే?

Related News

ప్రధాని నరేంద్రమోదీ ‘బంగారం’ మాటలు.. ఆపై గృహాలు, దేవాలయాల వంతు

ఆయిల్ తర్వాత గ్యాస్ వంతు మొదలు.. మరోసారి కమర్షియల్‌గా బాదుడు.. సిలిండర్‌కు రూ.42

బాలికలకు వరం… సుకన్య సమృద్ధి యోజనలో ఇలా పెట్టుబడి పెడితే మీ కూతురుకి 50 లక్షలు పక్కా

నెలలో ఏ తేదీన సిప్ వేస్తే ఎక్కువ లాభం… 30 ఏళ్ల అధ్యయనం చెప్పిన షాకింగ్ నిజం

క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ 5 పొరపాట్లు చేస్తే భారీ ఆర్థిక నష్టం తప్పదు

డాలర్లు అమ్మడం ద్వారా ఆర్‌బీఐకి లక్షల కోట్ల లాభం… రూపాయి విలువను కాపాడే వ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఇదే

దేశంలో ఇళ్ల ధరలకు రెక్కలు.. 24 శాతం వరకు పెరుగుదల నమోదు, ఇక హైదరాబాద్‌ మాటేంటి?

బంగారం-వెండి ధరలు తగ్గుముఖం.. కొనుగోలు ఇదే సరైన సమయం, మార్కెట్లో ధరల మాటేంటి?

Big Stories

×