భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం కారణంగా భారత్ లో హార్లే డేవిడ్సన్ బైక్స్ ఇకపై మరింత చౌకగా లభించనున్నాయి. తాత్కాలిక వాణిజ్య ఒప్పందంలో భాగంగా అమెరికన్ మోటార్ సైకిల్ తయారీదారులకు భారత్ జీరో డ్యూటీ యాక్సెస్ను మంజూరు చేయనుంది. ఆ తర్వాత హార్లే డేవిడ్సన్ కంపెనీకి పెద్ద మొత్తంలో మేలు కలగనుంది. 800-1,600 cc, అంతకంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం కలిగిన బైక్లకు కేంద్రం తాత్కాలిక వాణిజ్య ఒప్పందం అమలు తేదీ నుంచి మినహాయింపును ఇస్తుంది. మార్చి నాటికి కొత్త పన్నులు అమలు కానున్నాయి.
భారీ ఇంజిన్ సామర్థ్యం కలిగిన అమెరికన్ బైక్స్ మీద పన్నులు కొన్నిసార్లు 110% వరకు ఉండేవి. కానీ, తాజా వాణిజ్య ఒప్పందం కారణంగా 30% వరకు తగ్గవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2025లో కూడా ప్రభుత్వం 1,600 cc వరకు ఇంజిన్ సామర్థ్యం కలిగిన మోటార్ సైకిళ్లపై దిగుమతి సుంకాలను తగ్గించింది. వీటిని పూర్తిగా బిల్ట్ అప్ యూనిట్లుగా దిగుమతి చేసుకుంటారు. వీటి పన్నులు 50% నుంచి 40%కి తగ్గించింది. 1,600 cc కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం కలిగిన మోటార్ సైకిళ్ల సుంకాన్ని 50% నుంచి 30%కి తగ్గించారు.
భారత్ హై ఎండ్ ప్రీమియం బైక్స్ కు చిన్న మార్కెట్. దేశీయ మార్కెట్లో అమెరికన్ ఆటో తయారీదారుల వాటా చాలా తక్కువ. 2020లో తక్కువ అమ్మకాల కారణంగా హార్లే బ్రాండ్ భారత్ నుంచి తప్పుకుంది. అదే సంవత్సరం తరువాత, దేశంలో ప్రీమియం మోటార్ సైకిళ్ల శ్రేణిని జంటగా అభివృద్ధి చేసి విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుని హీరో మోటోకార్ప్ తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఒప్పందంలో భాగంగా, హీరో భారత్ లో హార్లే బైక్లకు సర్వీస్, విడిభాగాల అవసరాలను పర్యవేక్షిస్తుంది.
Read Also: ఐక్యూబ్ To చేతక్, జనవరిలో ఎక్కువ మంది సెర్చ్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!
అటు 2,500 సిసి, అంతకంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం కలిగిన యుఎస్ డీజిల్ వాహనాలు, 3,000 సిసి, అంతకంటే ఎక్కువ పెట్రోల్ వాహనాలపై భారత్ దిగుమతి సుంకంపై రాయితీలను అందించాలని కంపెనీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఫోర్డ్, జనరల్ మోటార్స్ (జిఎం) లాంటి అమెరికన్ వాహన తయారీదారులు భారతదేశంలో వ్యాపారాన్ని గణనీయంగా తగ్గించుకున్నారు. దేశీయ ఆటో మార్కెట్లో మెరుగైన స్థానంలో ఉన్న జీప్ తక్షణ ప్రయోజనాన్ని పొందుతుందని పలు మీడియా సంస్థలు కథనాలు రాశాయి. అయితే, ఈ వాణిజ్య ఒప్పందంలో భాగంగా.. ఎలక్ట్రిక్ వాహనాలకు ఎటువంటి మినహాయింపులు, సుంకాల కోతలు ప్రకటించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ నిర్ణయం టెస్లాకు ఇబ్బంది కలిగించనుంది. దేశీయ ఆటో మేజర్లు మహీంద్రా & మహీంద్రా, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ ఉపశమనం పొందే అవకాశం ఉంది.
Read Also: ఐక్యూబ్ To చేతక్, జనవరిలో ఎక్కువ మంది సెర్చ్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!