BigTV English

College Girls Raped by trapping: మొబైల్ యాప్‌ను ఉపయోగించి.. కాలేజీ విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడిన కార్మికుడు!

College Girls Raped by trapping: మొబైల్ యాప్‌ను ఉపయోగించి.. కాలేజీ విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడిన కార్మికుడు!

College Girls Raped by trapping them with mobile voice Changer app: సాంకేతికత ప్రజల జీవితాలను సులభతరం చేస్తోంది. మరోవైపు ఈ సాంకేతికతను దుర్వినియోగం చేయడం వల్ల చాలామంది జీవితాలు నాశనమవుతున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ సంచలన ఘటన వెలుగు చూసింది. సాంకేతికత కారణంగా కాలేజీ విద్యార్థినులు ఒక్కొక్కరుగా అత్యాచారానికి గురవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయం తెలిసి అంతా షాక్ అవుతున్నారు.


ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. మధ్యప్రదేశ్ లోని సిద్ధి జిల్లాలో తాజాగా ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఏడుగురు కాలేజీ విద్యార్థినులు అత్యాచారానికి గురైనట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఏడుగురిలో ఓ మైనర్ కూడా ఉన్నట్లు గుర్తించారు. అయితే, వారిని ట్రాప్ చేసేందుకు నిందితులు ఓ మొబైల్ యాప్ ను ఉపయోగించారని విచారణలో తేలింది. విషయం వెలుగులోకి రావడంతో జిల్లా వ్యాప్తంగా కలకలం రేగింది.

ఇందుకు సంబంధించి శుక్రవారం కాలేజీ విద్యార్థిని ఫిర్యాదు చేయడంతో అత్యాచారం కేసు నమోదయ్యింది.. అయితే, కేసు దర్యాప్తును ప్రారంభించిన పోలీసులు మొబైల్ నెంబర్, లొకేషన్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు.


అతడిని అరెస్ట్ చేసిన తరువాత విచారణ చేయగా, ఆ విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. నిందితుడి వృతిరీత్యా కూలీగా పనిచేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అతనితోపాటు మరో ఇద్దరు ఈ కేసులో నిందితులుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు మొత్తం ఏడుగురు కాలేజీ విద్యార్థినులను ఇలాగే బలితీసుకున్నట్లు విచారణలో తేలింది. వారిని ట్రాప్ చేసేందుకు నిందితులు మొబైల్ యాప్ సాయం తీసుకున్నట్లు అందులో తేలింది.

నిందితులు కాలేజీ టీచర్ గా నటిస్తూ మహిళా గొంతుతో మాట్లాడుతూ స్కాలర్ షిప్ కోసం పత్రాలు కావాలనే వంకతో ఫోన్లు చేసేవారని.. నిందితులు స్కాలర్ షిప్ పొందే కాలేజీ విద్యార్థులను టార్గెట్ చేసేవారని, అలా ఫోన్ చేసి విద్యార్థినులను ఏకాంత ప్రదేశాల్లోకి తీసుకెళ్లి వారిపై అత్యాచారానికి నిందితులు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం బాధితుల వద్ద ఉన్న సెల్ ఫోన్లను కూడా వారు గుంజుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయమై ఓ బాధితుడు కూడా ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు మొత్తం ఏడుగురు కాలేజీ విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అందులో ఒక మైనర్ బాలిక ఉన్నట్లు గుర్తించారు. అరెస్ట్ చేసిన ప్రధాన నిందితుడి నుంచి బాధితుల మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Also Read: గన్ పౌడర్ తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. ఒకరు మృతి

ఈ విషయం వెలుగులోకి రావడంతో స్థానికంగా కలకలం రేగింది. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయిలో విచారణ జరిపించాలని మాజీ సీఎం కమల్ నాథ్ డిమాండ్ చేశారు. ఈ ఘటన అత్యంత బాధాకరమన్నారు. ఏడుగురే కాదు… బాధితులు ఇంకా ఎక్కువగా ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై ఉన్నత స్థాయిలో విచారణ జరపాలంటూ సోషల్ మీడియా వేదికగా ఆయన డిమాండ్ చేశారు.

Related News

Nellore Crime: ఆ వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. పేరెంట్స్ ఏమన్నారంటే?

Customs arrest: ఎయిర్‌పోర్టులో చెకింగ్.. బ్యాగ్ నిండా పురుగులే.. అక్కడే అరెస్ట్!

Odisha murder case: తమ్ముడుని చంపి ఇంట్లోనే పాతేసిన అన్న.. 45 రోజుల తరవాత వెలుగులోకి..

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Big Stories

×