BigTV English
Advertisement

College Girls Raped by trapping: మొబైల్ యాప్‌ను ఉపయోగించి.. కాలేజీ విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడిన కార్మికుడు!

College Girls Raped by trapping: మొబైల్ యాప్‌ను ఉపయోగించి.. కాలేజీ విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడిన కార్మికుడు!

College Girls Raped by trapping them with mobile voice Changer app: సాంకేతికత ప్రజల జీవితాలను సులభతరం చేస్తోంది. మరోవైపు ఈ సాంకేతికతను దుర్వినియోగం చేయడం వల్ల చాలామంది జీవితాలు నాశనమవుతున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ సంచలన ఘటన వెలుగు చూసింది. సాంకేతికత కారణంగా కాలేజీ విద్యార్థినులు ఒక్కొక్కరుగా అత్యాచారానికి గురవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయం తెలిసి అంతా షాక్ అవుతున్నారు.


ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. మధ్యప్రదేశ్ లోని సిద్ధి జిల్లాలో తాజాగా ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఏడుగురు కాలేజీ విద్యార్థినులు అత్యాచారానికి గురైనట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఏడుగురిలో ఓ మైనర్ కూడా ఉన్నట్లు గుర్తించారు. అయితే, వారిని ట్రాప్ చేసేందుకు నిందితులు ఓ మొబైల్ యాప్ ను ఉపయోగించారని విచారణలో తేలింది. విషయం వెలుగులోకి రావడంతో జిల్లా వ్యాప్తంగా కలకలం రేగింది.

ఇందుకు సంబంధించి శుక్రవారం కాలేజీ విద్యార్థిని ఫిర్యాదు చేయడంతో అత్యాచారం కేసు నమోదయ్యింది.. అయితే, కేసు దర్యాప్తును ప్రారంభించిన పోలీసులు మొబైల్ నెంబర్, లొకేషన్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు.


అతడిని అరెస్ట్ చేసిన తరువాత విచారణ చేయగా, ఆ విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. నిందితుడి వృతిరీత్యా కూలీగా పనిచేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అతనితోపాటు మరో ఇద్దరు ఈ కేసులో నిందితులుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు మొత్తం ఏడుగురు కాలేజీ విద్యార్థినులను ఇలాగే బలితీసుకున్నట్లు విచారణలో తేలింది. వారిని ట్రాప్ చేసేందుకు నిందితులు మొబైల్ యాప్ సాయం తీసుకున్నట్లు అందులో తేలింది.

నిందితులు కాలేజీ టీచర్ గా నటిస్తూ మహిళా గొంతుతో మాట్లాడుతూ స్కాలర్ షిప్ కోసం పత్రాలు కావాలనే వంకతో ఫోన్లు చేసేవారని.. నిందితులు స్కాలర్ షిప్ పొందే కాలేజీ విద్యార్థులను టార్గెట్ చేసేవారని, అలా ఫోన్ చేసి విద్యార్థినులను ఏకాంత ప్రదేశాల్లోకి తీసుకెళ్లి వారిపై అత్యాచారానికి నిందితులు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం బాధితుల వద్ద ఉన్న సెల్ ఫోన్లను కూడా వారు గుంజుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయమై ఓ బాధితుడు కూడా ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు మొత్తం ఏడుగురు కాలేజీ విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అందులో ఒక మైనర్ బాలిక ఉన్నట్లు గుర్తించారు. అరెస్ట్ చేసిన ప్రధాన నిందితుడి నుంచి బాధితుల మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Also Read: గన్ పౌడర్ తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. ఒకరు మృతి

ఈ విషయం వెలుగులోకి రావడంతో స్థానికంగా కలకలం రేగింది. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయిలో విచారణ జరిపించాలని మాజీ సీఎం కమల్ నాథ్ డిమాండ్ చేశారు. ఈ ఘటన అత్యంత బాధాకరమన్నారు. ఏడుగురే కాదు… బాధితులు ఇంకా ఎక్కువగా ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై ఉన్నత స్థాయిలో విచారణ జరపాలంటూ సోషల్ మీడియా వేదికగా ఆయన డిమాండ్ చేశారు.

Related News

Chittoor Leopard Attack: చిరుతపులి దాడిలో లేగదూడ మృతి.. భయాందోళనలో గ్రామస్థులు

Ahmedabad Crime: దృశ్యం మూవీ తరహాలో.. భర్తని చంపి వంట గదిలో పూడ్చింది, ఆ తర్వాత..

Sangareddy News: చీమల భయం.. అనుక్షణం వెంటాడాయి, నావల్ల కాదంటూ వివాహిత ఆత్మహత్య

Road Accident: బీచ్‌కి వెళ్లి వస్తూ.. బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం అక్కడికక్కడే ఇద్దరు మృతి

Hyderabad News: సహజీవనం.. డ్రగ్స్‌ తీసుకున్న జంట.. ఓవర్ డోస్‌తో ఒకరు మృతి, మరొకరి పరిస్థితి

Hyderabad News: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. నలుగురు చిక్కారు, మరి డ్రోన్ల మాటేంటి?

Bus Fire Accident: మరో ఘోర ప్రమాదం.. మంటల్లో కాలిబూడిదైన ఆర్టీసీ బస్సు

Bus Accident: రాష్ట్రంలో మరో బస్సుప్రమాదం.. పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు, స్పాట్‌లో ముగ్గురు..?

Big Stories

×