E-Paper
Advertisement

Madhya Pradesh News: తల్లిపై అత్యాచారం.. షాకైక కొడుకు, చివరకు ఆత్మహత్య

Madhya Pradesh News: తల్లిపై అత్యాచారం.. షాకైక కొడుకు, చివరకు ఆత్మహత్య

Madhya Pradesh News: మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లోని భికుపురా ప్రాంతంలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. తల్లిపై కొందరు అత్యాచారం చేయడంతో తట్టుకోలేక ఆమె కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆగ్రహించిన గ్రామస్తులు రహదారిని దిగ్బంధించారు. నిందితుడి ఇంటిపై రాళ్లు దాడి చేసి ధ్వంసం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు, నిందితుడ్ని అరెస్ట్ చేశారు. అసలేం జరిగింది?

మధ్యప్రదేశ్‌లో దారుణం.. టీనేజర్ ఆత్మహత్య వెనుక

మధ్యప్రదేశ్‌లో దేవాస్ జిల్లాలోని శనివారం దారుణమైన ఘటన బయటకు వచ్చింది. తన తల్లిపై లైంగిక దాడి జరగడంతో తట్టుకోలేకపోయాడు బాధితురాలి 17 ఏళ్ల కొడుకు. దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఫలితంగా టీనేజర్ ఆత్మహత్య చేసుకున్నాడు. సునీల్ మాలవీయ అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

సున్నితమైన కేసు కావడంతో మహిళా అధికారి అందుబాటులో లేకపోవడంతో పోలీసులు వెంటనే కేసు నమోదు చేయలేదు. ఫిర్యాదు స్వీకరించడంలో పోలీసులు నిర్లక్ష్యం వహించారని గ్రామస్తులు ఆరోపించారు. ఫలితంగా ఆందోళనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జరిగిన పరిణామంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె కొడుకు శనివారం ఉదయం పురుగుల మందు తాగాడు.

బాలుడి తల్లిపై అత్యాచారం.. కేసు నమోదు చేయడంలో పోలీసులు ఆలస్యం

వెంటనే వాడ్ని స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. బాలుడి మరణంతో ఆగ్రహానికి గురయ్యారు స్థానికులు. బాలుడి మృతదేహంతో పుంజాపురా-బాగ్లీ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అంతేకాదు నిందితుడి ఇంటిపై రాళ్లతో దాడి చేసి ధ్వంసం చేశారు. అతడి వాహనానికి నిప్పుపెట్టారు. ఈా ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం పరిస్థితిని అదుపులో ఉంది. నిందితుడు సునీల్ మాలవీయను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మహిళా అధికారి లేకపోవడంతోనే కేసు నమోదు చేయడం ఆలస్యమైందని తెలిపారు.

ALSO READ: వీధి కుక్కల బీభత్సం.. 8 ఏళ్ల బాలికపై దాడి, రక్తపు మడుగులో చిన్నారి

ఈలోపు ఊహించని దురదృష్టకర ఘటన జరిగిందన్నారు. నిందితుడి ఆస్తులపై విచారణ జరుపుతామని హమీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు తమ ఆందోళనను విరమించారు. ఇలాంటి కేసుల విషయంలో పోలీసులు సరిగా వ్యవహరించకుంటే పరిమాణాలు తీవ్రంగా ఉంటాయని ఈ ఘటన చెబుతోంది.

Related News

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

Big Stories

×