BigTV English
Advertisement

Suspicious Death: భోపాల్‌లో ఏపీ విద్యార్థి మృతి.. డ్రగ్స్ తీసుకోనందుకే చంపేశారంటున్న బంధువులు!

Suspicious Death: భోపాల్‌లో ఏపీ విద్యార్థి మృతి.. డ్రగ్స్ తీసుకోనందుకే చంపేశారంటున్న బంధువులు!

Student Suspicious death in Bhopal: భోపాల్ ఎన్ఐటీ కళాశాలలో ఎంటెక్ విద్యార్థి శశిధర్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. తోటి విద్యార్థులే హత్య చేసి, ఆత్మహత్య అంటున్నారని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇతర మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊళ్ళపాలెం గ్రామ నివాసి శశిధర్ మధ్యప్రదేశ్ లోని భోపాల్ ఎన్ఐటి కళాశాలలో ఎంటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అయితే, సెప్టెంబర్ రెండవ తేదీన విద్యార్థి తన రూమ్ లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని కళాశాల యాజమాన్యం బంధువులకి తెలియజేసింది. దీంతో వెంటనే బంధువులు భోపాల్ కళాశాల వద్దకు వెళ్లి తమ బిడ్డ ఆత్మహత్య చేసుకునే పిరికివాడు కాదని, అతని స్నేహితులు, మరి కొందరు కలిసి హత్య చేసి, ఆత్మహత్యగా సృష్టించారంటూ ఆరోపించారు.


Also Read: ఎవరైనా సరే.. ఎమ్మెల్యే లకు చంద్రబాబు వార్నింగ్

కాగా, పలువురు వ్యక్తులు శశిధర్ ను నిత్యం వేధించే వారని.. కాలేజీలో డ్రగ్స్ సరఫరా ఉందని, శశిధర్ కు డ్రగ్స్ అలవాటు చేసేందుకు వారు ప్రయత్నించడంతో శశిధర్ ససేమిరా అంటున్నందుకు అతడిపై కక్ష పెట్టుకుని హత్య చేశారని, మృతదేహం మెడపై తీవ్ర గాయాలు కూడా ఉన్నాయని, ఇది ముమ్మాటికీ హత్యే అంటూ, కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన జరిగినదని వారిపై కూడా చర్యలు తీసుకుని, మాకు న్యాయం చేయాలని శశిధర్ బంధువులు ఆరోపిస్తున్నారు. మధ్యప్రదేశ్ పోలీసులు ఆత్మహత్యగా కేసు నమోదు చేసి, పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. మృతదేహానికి స్వగ్రామమైన ఊళ్ళపాలెం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.


Also Read: జగన్ ఫారెన్ టూర్ ఆలస్యం.. పాస్‌పోర్టు కష్టాలు, వెనుక ఏదో..

భోపాల్ ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం ఈ ఘటనపై స్పందించాలని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు కోరుతున్నారు. దీనిపై పూర్తి విచారణ చేసి తమకు న్యాయం చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. చూడాలి మరి రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుందా లేదా అనేది.

Related News

Hyderabad News: హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్యాయత్నం.. అసలేం జరిగిందంటే..?

TMC MP Kalyan Banerjee: సైబర్ వలకు చిక్కిన ఎంపీ కళ్యాణ్ బెనర్జీ.. ₹55 లక్షల స్వాహా!

Tamil Nadu: చిన్నారి ప్రాణం తీసిన తల్లి.. మరో మహిళతో అఫైర్‌!

Nellore Accident: నెల్లూరులో స్కార్పియో యాక్సిడెంట్.. నలుగురు టీచర్లు స్పాట్!

Rajendranagar Accident: ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన డీసీఎం వాహనం..

Chittoor Leopard Attack: చిరుతపులి దాడిలో లేగదూడ మృతి.. భయాందోళనలో గ్రామస్థులు

Ahmedabad Crime: దృశ్యం మూవీ తరహాలో.. భర్తని చంపి వంట గదిలో పూడ్చింది, ఆ తర్వాత..

Sangareddy News: చీమల భయం.. అనుక్షణం వెంటాడాయి, నావల్ల కాదంటూ వివాహిత ఆత్మహత్య

Big Stories

×