E-Paper
Advertisement

Suspicious Death: భోపాల్‌లో ఏపీ విద్యార్థి మృతి.. డ్రగ్స్ తీసుకోనందుకే చంపేశారంటున్న బంధువులు!

Suspicious Death: భోపాల్‌లో ఏపీ విద్యార్థి మృతి.. డ్రగ్స్ తీసుకోనందుకే చంపేశారంటున్న బంధువులు!

Student Suspicious death in Bhopal: భోపాల్ ఎన్ఐటీ కళాశాలలో ఎంటెక్ విద్యార్థి శశిధర్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. తోటి విద్యార్థులే హత్య చేసి, ఆత్మహత్య అంటున్నారని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇతర మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊళ్ళపాలెం గ్రామ నివాసి శశిధర్ మధ్యప్రదేశ్ లోని భోపాల్ ఎన్ఐటి కళాశాలలో ఎంటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అయితే, సెప్టెంబర్ రెండవ తేదీన విద్యార్థి తన రూమ్ లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని కళాశాల యాజమాన్యం బంధువులకి తెలియజేసింది. దీంతో వెంటనే బంధువులు భోపాల్ కళాశాల వద్దకు వెళ్లి తమ బిడ్డ ఆత్మహత్య చేసుకునే పిరికివాడు కాదని, అతని స్నేహితులు, మరి కొందరు కలిసి హత్య చేసి, ఆత్మహత్యగా సృష్టించారంటూ ఆరోపించారు.

Also Read: ఎవరైనా సరే.. ఎమ్మెల్యే లకు చంద్రబాబు వార్నింగ్

కాగా, పలువురు వ్యక్తులు శశిధర్ ను నిత్యం వేధించే వారని.. కాలేజీలో డ్రగ్స్ సరఫరా ఉందని, శశిధర్ కు డ్రగ్స్ అలవాటు చేసేందుకు వారు ప్రయత్నించడంతో శశిధర్ ససేమిరా అంటున్నందుకు అతడిపై కక్ష పెట్టుకుని హత్య చేశారని, మృతదేహం మెడపై తీవ్ర గాయాలు కూడా ఉన్నాయని, ఇది ముమ్మాటికీ హత్యే అంటూ, కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన జరిగినదని వారిపై కూడా చర్యలు తీసుకుని, మాకు న్యాయం చేయాలని శశిధర్ బంధువులు ఆరోపిస్తున్నారు. మధ్యప్రదేశ్ పోలీసులు ఆత్మహత్యగా కేసు నమోదు చేసి, పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. మృతదేహానికి స్వగ్రామమైన ఊళ్ళపాలెం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.

Also Read: జగన్ ఫారెన్ టూర్ ఆలస్యం.. పాస్‌పోర్టు కష్టాలు, వెనుక ఏదో..

భోపాల్ ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం ఈ ఘటనపై స్పందించాలని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు కోరుతున్నారు. దీనిపై పూర్తి విచారణ చేసి తమకు న్యాయం చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. చూడాలి మరి రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుందా లేదా అనేది.

Related News

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

ఆర్టీసీ బస్సులో గంజాయి దందా.. తనిఖీల్లో పోలీసులకే దిమ్మతిరిగే షాక్!

Big Stories

×