Crime News: ఏపీలోని పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి తల్లీ, కొడుకుపై కత్తితో దాడి చేసి గొంతులు కోశారు. ఈ దాడిలో కొడుకు సాంబశివరావు అక్కడికక్కడే మృతి చెందగా, తల్లి కృష్ణకుమారి పరిస్థితి విషమంగా ఉంది.
ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ హత్య కేసులో పోలీసులు వేగంగా స్పందించారు. నకరికల్లు మండలం, చాగల్లు గ్రామం వద్ద పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
Also Read: యూకేలో దారుణం: భారత విద్యార్థిపై కత్తులతో దాడి.. చికిత్స పొందుతూ మృతి!
నిందితులు మైనర్లుగా సమాచారం
నిందితులు మైనర్లుగా తెలుస్తోంది. నిందితులను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు, పోలీసుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఆగ్రహించిన గ్రామస్తులు నిందితులను చితకబాదడానికి ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
తల్లి, కొడుకుపై కత్తితో దాడి..
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో దారుణ ఘటన
ఇంట్లోకి ప్రవేశించి తల్లి, కొడుకు గొంతు కోసిన దుండగులు
కుడుకు సాంబశివరావు మృతి, తల్లి కృష్ణకుమారి పరిస్థితి విషమం
ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు pic.twitter.com/u966LGEgwH
— BIG TV Breaking News (@bigtvtelugu) November 30, 2025