Hyderabad News: సరిగా చదువుకోవాలని పిల్లలను కాలేజీలకు పంపిస్తే.. లవ్ అంటూ జీవితం పాడు చేసుకుంటున్నారు కొందరు విద్యార్థులు. దాన్ని నుంచి బయటపడలేక ఈలోకాన్ని విడిచి పెట్టేస్తున్నారు. అలాంటి ఘటన ఒకటి హైదరాబాద్ లో వెలుగుచూసింది. ప్రేమించిన అమ్మాయి మరొకన్ని వివాహం చేసుకోవడంతో తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు బీటెక్ స్టూడెంట్.
ప్రేమ విఫలం కావడంతో ఆ యువకుడు షాక్
గుంటూరు జిల్లా పొత్తూరు ప్రాంతానికి చెందిన దంపతులు హైదరాబాద్లో ఉంటున్నారు. ఉపాధి నిమిత్తం సురారం ప్రాంతంలో జీవనం సాగిస్తున్నారు. వారి కొడుకుని ఇక్కడే చదివిస్తున్నారు. బీటెక్ సెకండ్ ఇయర్ హైదరాబాద్లోని ఓ కాలేజీ చదువుతున్నాడు. మరి ఏం జరిగిందో తెలీదు. అతడు ప్రేమించిన అమ్మాయికి ఆరు నెలల కిందట వివాహం జరిగింది.
అమ్మాయికి.. తన లవ్ గురించి స్టూడెంట్ చెప్పాడా? లేక వన్ సైడ్ లవ్ అనేది తెలీదు. తాను మనస్ఫూర్తిగా కోరుకున్న అమ్మాయికి వివాహం కావడంతో తట్టుకోలేకపోయాడు. అప్పటి నుంచి డల్గా మారిపోయాడు. పేరెంట్స్ ఏం అడిగినా సైలెంట్గా ఉండడం మొదలైంది. తల్లిదండ్రులు మాత్రం, పరీక్ష పోయిందేమో, అందుకే అలా ఉన్నాడని అనుకున్నారు.
తట్టుకోలేక బీటెక్ స్టూడెంట్
ఇంట్లో ఎవరూలేని సమయంలో శనివారం రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పేరెంట్స్ ఇంటికి వచ్చేసరికి ఫ్యాన్కి వేలాడుతున్న కొడుకుని చూసి షాకయయారు. ఈ విషయం తెలియగానే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ: నంద్యాలలో ఘోర విషాదం.. ట్రాక్టర్ పడి బాలుడు మృతి
చేతికి అందివచ్చిన కొడుకు అర్థాంతరంగా ఈ లోకాన్ని విడిచిపెట్టడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకుండాదని అంటున్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని చదివించిన కొడుకు కళ్ల ముందే ఆత్మహత్యకు పాల్పడడం తట్టుకోలేకపోతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.