E-Paper
Advertisement

Bengaluru Crime: బెంగుళూరులో దారుణం.. బీబీఏ విద్యార్థిని దారుణహత్య, ఆమె సొంతూరు ఏపీ

Bengaluru Crime: బెంగుళూరులో దారుణం.. బీబీఏ విద్యార్థిని దారుణహత్య, ఆమె సొంతూరు ఏపీ

Bengaluru Crime: కారణాలు ఏమైనా కావచ్చు. బెంగుళూరులో బీబీఏ విద్యార్థిని దారుణహత్యకు గురైంది. ప్రియుడే యువతికి ఊపిరి ఆరకుండా చేసి హత్య చేసినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.  యువతి ఆంధ్రప్రదేశ్‌కి చెందినది . దీంతో ఏదో జరిగిందోనన్న అనుమానాలు మొదలయ్యాయి. అసలు యువతి విషయంలో ఏం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

బెంగుళూరులో యువతి దారుణహత్య

బెంగళూరులో చదువుతున్న 21 ఏళ్ల బీబీఏ విద్యార్థిని ఆదివారం హత్యకు గురైంది. బాధితురాలు దేవిశ్రీగా గుర్తించారు. ఆచార్య కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్-BBM చివరి సంవత్సరం చదువుతోంది. ఆమె మృతికి ప్రియుడు కాణమనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం బిక్కింవారిపల్లె ప్రాంతానికి చెందినది దేవశ్రీ. రెడ్డెప్ప-జగదాంబ దంపతుల గారాలపట్టి దేవశ్రీ. బెంగుళూరులోని ఆచార్య కాలేజీలో బీబీఏ చదువుతోంది. కాలేజీకి సమీపంలోని అద్దెకు ఉంటోంది దేవశ్రీ. ఆమె ఫ్రెండ్ చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం పెద్దకొండామర్రికి చెందిన ప్రేమవర్ధన్‌. మరి ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదు.

ప్రియుడే యముడు.. మృతురాలు ఏపీకి వాసి

దేవిశ్రీ స్నేహితుడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జయంత్ ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నాడు. సోమవారం ఉదయం ఆమె రూమ్‌కి వెళ్లాడు. డోర్ బయట లాక్ చేసి వుంది. కిటికీలో నుంచి చూడగా విగత జీవిగా దేవిశ్రీ పడి ఉంది. వెంటనే ఇంటి యజమానికి సమాచారం ఇవ్వడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. అతడు మాదనాయకనహళ్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

పోలీసులు మాత్రం ప్రేమ్ వర్ధన్.. దేవిశ్రీని గొంతు కోసి లేదా ఊపిరాడకుండా చేసి హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. ప్రేమ్-దేవిశ్రీ ఆదివారం ఉదయం 9. 30 గంటల సమయంలో గదికి వచ్చారు. రాత్రి 8.30 గంటల వరకు అక్కడే ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ఆ సమయంలో ఏమైనా జరిగి ఉండవచ్చని అంటున్నారు. ఆ తర్వాత అతడు గదికి తాళం వేసి పారిపోయినట్టు తెలుస్తోంది.

ALSO READ: రైలు ఎక్కుతుండగా మహిళను అక్కడ పట్టుకున్న ఆకతాయి

ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండటంతో గాలింపు మొదలుపెట్టారు.  కూతురు హత్య విషయం తెలియగానే తల్లిదండ్రులు షాకయ్యారు. చదువు పూర్తి చేసుకుని డిగ్రీ పట్టాతో ఇంటికి వస్తుందని భావించామని, అంతలోనే ఈ లోకాన్ని విడిచిపెట్టడాన్ని జీర్ణించుకోలేపోతున్నారు. వారిని ఓదార్చడం ఎవరివల్ల కావడం లేదు. పోలీసుల విచారణలో ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయో?

Related News

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

ఆర్టీసీ బస్సులో గంజాయి దందా.. తనిఖీల్లో పోలీసులకే దిమ్మతిరిగే షాక్!

Big Stories

×