E-Paper
Advertisement

Mehdipatnam Lift Incident: గ్రిల్స్‌కి గోడకు మధ్య ఇరుక్కొని.. మరో బాలుడి ప్రాణం తీసిన లిఫ్ట్

Mehdipatnam Lift Incident: గ్రిల్స్‌కి గోడకు మధ్య ఇరుక్కొని.. మరో బాలుడి ప్రాణం తీసిన లిఫ్ట్
Advertisement

బుధవారం రాత్రి 10 గంటల టైంలో సురేందర్‌ ఆడుకుంటూ లిఫ్ట్‌ తలుపు మధ్యకు వెళ్లగా.. ఎవరూ గుర్తించలేదు. 10 నిముషాల తర్వాత సురేందర్‌ ఎక్కడున్నాడని వెతకగా.. లిఫ్ట్‌మధ్యలో ఇరుక్కుని రక్తపుమడుగులో అపస్మారకస్థితిలో ఉన్నాడు. తల్లిదండ్రులు రోదిస్తుండగానే.. అపార్ట్‌మెంట్‌ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు లిఫ్ట్‌లో ఇరుక్కున్న బాలుడిని హుటాహుటిన ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చనిపోయాడని వైద్యులు చెప్పారు.

Advertisement

దీంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. వీరు నేపాల్‌ నుంచి జీవనోపాధి నిమిత్తం 7నెలల క్రితం నగరానికి వచ్చారు. మొదలు గుడిమల్కాపూర్‌లో నిర్మాణంలో ఉన్న భవనానికి వాచ్ మెన్‌గా పనిచేశాడు. 3 నెలల క్రితం ముజ్తాబా అపార్ట్‌మెంట్‌కు వచ్చాడు. ఇటీవల వరుసగా లిఫ్ట్‌ ప్రమాదాలు జరుగుతున్నాయి. నాంపల్లిలో ఇటీవల లిఫ్ట్‌, అపార్ట్‌మెంట్‌ గోడకు మధ్య చిక్కుకుని ఆరేళ్ల బాలుడు దుర్మరణం చెందాడు. రెండు రోజుల కిందట రాజన్న సిరిసిల్ల జిల్లా 17వ బెటాలియన్‌ కమాండెంట్ గంగారాం లిఫ్ట్‌ ప్రమాదంలో చనిపోయాడు.

హైదరాబాద్ నగరంలో ఈ తరహా ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా అధికారులు అప్రమత్తం అవ్వాలి. ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు చేపట్టాలి. మెయింటెన్స్‌కి సంభందించి టెక్నికల్ ప్రాబ్లమ్ లేకుండా అపార్ట్ మెంట్ యాజమాన్యం జాగ్రత్తగా చూసుకోవాలి. అంతే కాదు పిల్లల పట్ల తమ తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. ఈ రెండేళ్లబాలుడు లిఫ్ట్ మధ్యలో చిక్కుకుని తీవ్ర రక్కస్రావంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

Advertisement

Also Read: ప్రియురాలికి నిప్పు పెట్టిన ప్రియుడు, ఆ తర్వాత ఏం జరిగింది.. యూపీలో దారుణం

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. బాలుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నిబంధనలుకు విరుద్దంగా అనేక అపార్టుమెంట్లలో, కమర్షియల్ కాంప్లెక్స్‌‌లో లిప్టులు నిర్వహించడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్గలు వరకు  ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. 15 రోజుల్లో ఇదే ఏరియాలో ఇద్దరు పిల్లలు మృతి చెందారు.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×