Hyderabad News: హైదరాబాద్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎల్బీనగర్లో భవనం సెల్లార్ తవ్వకాల్లో మట్టిదిబ్బలు కూలిపోవడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను బీహార్, సూర్యాపేటకు చెందిన వాసులుగా గుర్తించారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
వివరాల ప్రకారం.. సెల్లార్ నిర్మాణం కోసం తవ్వకాలు జరుగుతుండగా మట్టిిదిబ్బలు విరిగిపడి వాటి కింద కార్మికులు చిక్కుకున్నారు. ఈ ఘటనలో సూర్యాపేట, బీహార్కు చెందిన ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితుల్ని కాపాడేందుకు ఫైర్ సిబ్బంది, పోలీసులు, డిఆర్ఎఫ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సెల్లార్ కోసం తీసిన రంధ్రాలు లోతుగా ఉండటంతో కార్మికులు పూర్తిగా మట్టిలో కూరుకుపోయారు. భవన నిర్మాణం కోసం తీసిన గుంతలో పిల్లర్లు నిర్మించి రిటైనింగ్ వాల్స్ నిర్మించేందుకు పనులు చేపడుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఫైల్స్లో కాంక్రీట్ నింపుతుండగాపై నుంచి మట్టిదిబ్బలు జారి పడిపోవడంతో కార్మికులు దాని కింద చిక్కుకుపోయారు.
భవన నిర్మాణంలో సరైన జాగ్రత్తలు పాటించకపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. మరో కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. భవన నిర్మాణ పనుల కోసం సూర్యాపేట, బీహార్ నుంచి వచ్చిన కార్మికులు విధుల్లో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.