E-Paper
Advertisement

Car Fire: హైవేపై అగ్నిప్రమాదం.. క్షణాల్లో కాలి బూడిదైన కారు..

Car Fire: హైవేపై అగ్నిప్రమాదం..  క్షణాల్లో కాలి బూడిదైన కారు..
Advertisement

Car Fire: సంగారెడ్డి జిల్లాలో బుధవారం పెను ప్రమాదం తృటిలో తప్పింది. సదాశివపేట మండలం నందికంది సమీపంలోని 65వ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ఒక కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి, వాహనం పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ప్రాణనష్టం తప్పి అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

హైదరాబాద్ – ముంబై జాతీయ రహదారిపై కారు ప్రయాణిస్తుండగా, ఇంజిన్ భాగం నుండి అకస్మాత్తుగా పొగలు రావడం డ్రైవర్ గమనించారు. ప్రమాదాన్ని పసిగట్టిన ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాహనాన్ని వెంటనే రహదారి పక్కకు నిలిపివేశారు. కారులోని వారు హుటాహుటిన బయటకు దిగి సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారు. వారు దిగిన కొద్ది క్షణాల్లోనే మంటలు కారు మొత్తానికి వ్యాపించాయి.

Advertisement

మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో చూస్తుండగానే కారు పూర్తిగా కాలి బూడిదైంది. జాతీయ రహదారిపై మంటలు ఎగిసిపడటంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదం కారణంగా హైవేపై వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు , అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అనంతరం ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×