E-Paper
Advertisement

Delhi Acid Attack: ఢిల్లీలో దారుణం.. డిగ్రీ విద్యార్థినిపై యాసిడ్ దాడి, ఎలా జరిగింది?

Delhi Acid Attack: ఢిల్లీలో దారుణం.. డిగ్రీ విద్యార్థినిపై యాసిడ్ దాడి, ఎలా జరిగింది?
Advertisement

Delhi Acid Attack: ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థినిపై యాసిడ్ దాడి చేశాడు ఓ యువకుడు. ఈ ఘటనలో యువతి ముఖం, చేతులకు తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే బాధితురాలిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువతికి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు.

ఢిల్లీలో దారుణమైన ఘటన

Advertisement

ఢిల్లీలోని అశోక్ విహార్‌లో 19 ఏళ్ల డిగ్రీ విద్యార్థి‌ని యాసిడ్ దాడి జరిగింది. ఆదివారం ఉదయం 10 గంటలకు జరిగిన ఈ ఘటన కళాశాలకు కూతవేటు దూరంలో ఈ ఘటన జరిగింది. ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వచ్చి నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థినిపై యాసిడ్ పోసి పారిపోయారు. ఈ దాడిలో యువతి ముఖం, చేతులకు గాయాలు అయ్యాయి. వెంటనే బాదితురాలిని RML ఆసుపత్రిలో తరలించారు.

ప్రస్తుతం యువతి చికిత్స పొందుతోంది. బాధితురాలి ఆరోగ్యం నిలకడగాని ఉందని, త్వరలో డిశ్చార్జ్ చేస్తారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. యాసిడ్ దాడికి పాల్పడిన వ్యక్తి పేరు జితేందర్.

Advertisement

డిగ్రీ విద్యార్థినిపై యాసిడ్ దాడి

యువతికి తెలిసిన వ్యక్తేనని, ఇద్దరు ముకుందపూర్ నివాసితులని పోలీసుల విచారణలో తేలింది. నిందితుడు జితేందర్ పరారీలో ఉన్నాడని అతని ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. జితేందర్‌తోపాటు తన సహచరులు ఇషాన్, అర్మాన్‌లతో కలిసి బైక్‌పై వచ్చాడు. ఇషాన్, అర్మాన్‌లకు యాసిడ్ బాటిల్ ఇచ్చాడని, మరొక బాటిల్ జితేందర్ పట్టుకుని యువతిపై పోసినట్టు తెలుస్తోంది.

బాధితురాలు తన ముఖాన్ని రక్షించుకోవడానికి చేతిలోని బ్యాగ్ పెట్టుకోవడానికి ప్రయత్నించింది. ఆ సమయంలో ఆమె రెండు చేతులు, ముఖానికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. జితేందర్ దాదాపు ఏడాదిగా యువతిని వేధిస్తున్నాడని, నెల కిందట వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని తేలింది.

ALSO READ:  లా విద్యార్థిపై కిరాతక దాడి, చేతి వేళ్లు నరికేసి

ఢిల్లీ యూనివర్సిటీలోని లక్ష్మీబాయి కళాశాలలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది బాధితురాలు. ప్రధాన నిందితుడు జితేందర్‌‌కు వివాహం జరిగింది. ఏడాదిన్నర కూతురు కూడా ఉందని ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం అధ్యక్షుడు ఆర్యన్ తెలిపాడు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశాడు.

 

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×