BigTV English
Advertisement

Delhi Acid Attack: ఢిల్లీలో దారుణం.. డిగ్రీ విద్యార్థినిపై యాసిడ్ దాడి, ఎలా జరిగింది?

Delhi Acid Attack: ఢిల్లీలో దారుణం.. డిగ్రీ విద్యార్థినిపై యాసిడ్ దాడి, ఎలా జరిగింది?

Delhi Acid Attack: ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థినిపై యాసిడ్ దాడి చేశాడు ఓ యువకుడు. ఈ ఘటనలో యువతి ముఖం, చేతులకు తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే బాధితురాలిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువతికి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు.


ఢిల్లీలో దారుణమైన ఘటన

ఢిల్లీలోని అశోక్ విహార్‌లో 19 ఏళ్ల డిగ్రీ విద్యార్థి‌ని యాసిడ్ దాడి జరిగింది. ఆదివారం ఉదయం 10 గంటలకు జరిగిన ఈ ఘటన కళాశాలకు కూతవేటు దూరంలో ఈ ఘటన జరిగింది. ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వచ్చి నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థినిపై యాసిడ్ పోసి పారిపోయారు. ఈ దాడిలో యువతి ముఖం, చేతులకు గాయాలు అయ్యాయి. వెంటనే బాదితురాలిని RML ఆసుపత్రిలో తరలించారు.


ప్రస్తుతం యువతి చికిత్స పొందుతోంది. బాధితురాలి ఆరోగ్యం నిలకడగాని ఉందని, త్వరలో డిశ్చార్జ్ చేస్తారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. యాసిడ్ దాడికి పాల్పడిన వ్యక్తి పేరు జితేందర్.

డిగ్రీ విద్యార్థినిపై యాసిడ్ దాడి

యువతికి తెలిసిన వ్యక్తేనని, ఇద్దరు ముకుందపూర్ నివాసితులని పోలీసుల విచారణలో తేలింది. నిందితుడు జితేందర్ పరారీలో ఉన్నాడని అతని ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. జితేందర్‌తోపాటు తన సహచరులు ఇషాన్, అర్మాన్‌లతో కలిసి బైక్‌పై వచ్చాడు. ఇషాన్, అర్మాన్‌లకు యాసిడ్ బాటిల్ ఇచ్చాడని, మరొక బాటిల్ జితేందర్ పట్టుకుని యువతిపై పోసినట్టు తెలుస్తోంది.

బాధితురాలు తన ముఖాన్ని రక్షించుకోవడానికి చేతిలోని బ్యాగ్ పెట్టుకోవడానికి ప్రయత్నించింది. ఆ సమయంలో ఆమె రెండు చేతులు, ముఖానికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. జితేందర్ దాదాపు ఏడాదిగా యువతిని వేధిస్తున్నాడని, నెల కిందట వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని తేలింది.

ALSO READ:  లా విద్యార్థిపై కిరాతక దాడి, చేతి వేళ్లు నరికేసి

ఢిల్లీ యూనివర్సిటీలోని లక్ష్మీబాయి కళాశాలలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది బాధితురాలు. ప్రధాన నిందితుడు జితేందర్‌‌కు వివాహం జరిగింది. ఏడాదిన్నర కూతురు కూడా ఉందని ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం అధ్యక్షుడు ఆర్యన్ తెలిపాడు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశాడు.

 

 

Related News

Karimnagar News: ప్రాణం తీసిన కిటికీ వివాదం.. సూసైడ్ నోట్ రాసి మరి..!

UP Crime: లా విద్యార్థిపై దారుణం, కడుపు చీల్చి-చేతి వేళ్లను నరికేశారు, యూపీలో షాకింగ్ ఘటన

AP Crime: ఏపీలో దారుణం.. మద్యం మత్తులో కన్న కూతురిపై తండ్రి అత్యాచారం

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లోనే మహిళ

Stray Dogs Attack: ఘోరం! బాలికపై వీధి కుక్కలు మూకుమ్మడి దాడి.. సీసీ కెమెరాల్లో రికార్డ్

Husband Suicide: ఇంట్లో అత్త ఉండొద్దని భార్య గొడవ.. 15 వ అంతస్తు నుంచి దూకి భర్త ఆత్మహత్య

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదంలో బిగ్ ట్విస్ట్.. బైకర్ పై ఎర్రిస్వామి ఫిర్యాదు.. మద్యం కొనుగోలు వీడియో వైరల్

Big Stories

×