E-Paper
Advertisement

Peddapalli Crime: గోదావరి ఖనిలో కత్తిపోట్ల కలకలం.. కత్తులతో కుటుంబసభ్యుల దాడులు

Peddapalli Crime: గోదావరి ఖనిలో కత్తిపోట్ల కలకలం.. కత్తులతో కుటుంబసభ్యుల దాడులు

Peddapalli Crime: ఫ్యామిలీలో చిన్న చిన్న సమస్యలు అగాధం రేపాయి.  ఫలితంగా కత్తులతో ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. వారిలో పలువురు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సంచలనం రేపిన ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో వెలుగు చూసింది. అసలేం జరిగింది.

పెద్దపల్లి జిల్లా మార్కండేయ కాలనీలో ఓ ఫ్యామిలీ ఉంటోంది. అయితే ఆ కుటుంబంలో ఏం జరిగిందో తెలీదు. ఒక్కసారిగా కత్తులతో దాడులు చేసుకోవడం సంచలనం రేపింది. కుటుంబ సభ్యుల మధ్య జరిగిన గొడవతో రామ్ దూత్ అనే వ్యక్తి కొబ్బరికాయలు కొట్టే కత్తితో కుటుంబ సభ్యులపై దాడి చేశాడు. సుమిత్ర, ప్రణయ్, కొమురమ్మలపై దాడికి దిగాడు.

ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే బాధితులను చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో ప్రణయ్ పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేస్తున్నారు. ఈ విషయం తెలియగానే సంఘటన స్థలాన్ని గోదావరి ఖని వన్ టౌన్ పోలీసులు చేసుకున్నారు.

కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు మొదలుపెట్టారు. ఘటన ఎలా జరిగింది? ఎందుకు కుటుంబసభ్యుల మధ్య గొడవలు జరిగాయి? దీని వెనుక ఎవరైనా ఉన్నారా? అనేదానిపై పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. బాబాయ్ కొడుకు.. సొంతం చిన్నమ్మపై విచక్షణారహితంగా దాడికి దిగినట్టు తెలుస్తోంది. సిగరెట్ షాప్ నిర్వహణ విషయంలో గొడవ తలెత్తినట్టు స్థానికులు చెబుతున్నారు.

 

Related News

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

ఆర్టీసీ బస్సులో గంజాయి దందా.. తనిఖీల్లో పోలీసులకే దిమ్మతిరిగే షాక్!

Big Stories

×