Peddapalli Crime: ఫ్యామిలీలో చిన్న చిన్న సమస్యలు అగాధం రేపాయి. ఫలితంగా కత్తులతో ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. వారిలో పలువురు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సంచలనం రేపిన ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో వెలుగు చూసింది. అసలేం జరిగింది.
పెద్దపల్లి జిల్లా మార్కండేయ కాలనీలో ఓ ఫ్యామిలీ ఉంటోంది. అయితే ఆ కుటుంబంలో ఏం జరిగిందో తెలీదు. ఒక్కసారిగా కత్తులతో దాడులు చేసుకోవడం సంచలనం రేపింది. కుటుంబ సభ్యుల మధ్య జరిగిన గొడవతో రామ్ దూత్ అనే వ్యక్తి కొబ్బరికాయలు కొట్టే కత్తితో కుటుంబ సభ్యులపై దాడి చేశాడు. సుమిత్ర, ప్రణయ్, కొమురమ్మలపై దాడికి దిగాడు.
ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే బాధితులను చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో ప్రణయ్ పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేస్తున్నారు. ఈ విషయం తెలియగానే సంఘటన స్థలాన్ని గోదావరి ఖని వన్ టౌన్ పోలీసులు చేసుకున్నారు.
కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు మొదలుపెట్టారు. ఘటన ఎలా జరిగింది? ఎందుకు కుటుంబసభ్యుల మధ్య గొడవలు జరిగాయి? దీని వెనుక ఎవరైనా ఉన్నారా? అనేదానిపై పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. బాబాయ్ కొడుకు.. సొంతం చిన్నమ్మపై విచక్షణారహితంగా దాడికి దిగినట్టు తెలుస్తోంది. సిగరెట్ షాప్ నిర్వహణ విషయంలో గొడవ తలెత్తినట్టు స్థానికులు చెబుతున్నారు.
పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో కత్తిపోట్ల కలకలం
సొంత బంధువులపైనే కత్తితో తెగబడ్డ రామ్ దూత్
బాబాయ్ కొడుకు, చిన్నమ్మపై విచక్షణారహితంగా దాడి
సిగరెట్ షాప్ నిర్వహణ విషయంలో తలెత్తిన గొడవ
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
Ram Dutt attacked his family members with a knife… pic.twitter.com/IXM5ahFSvB
— BIG TV Breaking News (@bigtvtelugu) February 20, 2026