E-Paper
Advertisement

Road Accident: ఘోర ప్రమాదం.. ఆటోను ఈడ్చుకెళ్లిన లారీ.. స్పాట్‌లోనే నలుగురు!

Road Accident: ఘోర ప్రమాదం.. ఆటోను ఈడ్చుకెళ్లిన లారీ.. స్పాట్‌లోనే నలుగురు!
Advertisement

Road Accident: నల్గొండ, దేవరకొండ ప్రధాన రహదారపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాంపల్లి మండలం దేవత్‌పల్లి గేట్ సమీపంలో అతి వేగంగా వచ్చిన ఓ లారీ, ప్రయాణికలతో వెళ్తున్న ఆటోను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జు నుజ్జు అయ్యింది. లారీ వేగం ఎంతలా ఉందంటే ఆటోలోని వారు తేరుకునే లోపే ప్రమాదం జరిగిపోయింది.

ఈ ఘోర ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో ఆటోలో మెుత్తం 10 మంది ఉన్నట్లు తెలుస్తోంది. మృతి చెందిన వారు కాకుండా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వారిని వెంటనే హైదరాబాద్‌కు తరలించారు.

Advertisement

స్థానికుల అందించిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారంణంగా రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. లారీ డ్రైవర్ అతివేగం, అజాగ్రత్తే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనతో దేవత్‌పల్లి గ్రామ పరిసరాల్లో విషాదఛాయలు అలముకున్నాయి.

Also Read: క్యాబేజీ లోడ్‌లో కోట్లాది రూపాయల గంజాయి.. ఎలా దొరికిపోయారో చూడండి!

Advertisement

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×