E-Paper
Advertisement

Ganja Seizure: క్యాబేజీ లోడ్‌లో కోట్లాది రూపాయల గంజాయి.. ఎలా దొరికిపోయారో చూడండి!

Ganja Seizure: క్యాబేజీ లోడ్‌లో కోట్లాది రూపాయల గంజాయి.. ఎలా దొరికిపోయారో చూడండి!
Advertisement

Ganja Seizure: విజయనగరం జిల్లాలో పోలీసులు భారీ స్థాయిలో గంజాయి స్మగ్లింగ్‌ను అడ్డుకున్నారు. ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు అక్రమంగా తరలిస్తున్న సుమారు 647 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అత్యంత పకడ్బందీగా.. ఎవరికీ అనుమానం రాకుండా కూరగాయల మాటున చేస్తున్న ఈ అక్రమ రవాణాను పోలీసులు తమ చాకచక్యంతో కనిపెట్టారు.

విజయనగరం జిల్లా బొండపల్లి వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఒడిశాలోని కోరాపుట్ నుండి విశాఖపట్నం వైపు వెళ్తున్న ఒక బొలెరో వాహనాన్ని పోలీసులు ఆపారు. పైకి చూడటానికి ఆ వాహనం నిండా క్యాబేజీ లోడ్ కనిపిస్తున్నప్పటికీ.. పోలీసులకు ఎక్కడో అనుమానం రావడంతో లోపల క్షుణ్ణంగా తనిఖీ చేశారు. క్యాబేజీ బస్తాల కింద దాచి ఉంచిన గంజాయి ప్యాకెట్లను చూసి పోలీసులు షాక్ అయ్యారు.

Advertisement

నిందితులు పోలీసుల కళ్లు గప్పేందుకు వినూత్నంగా ఆలోచించారు. వాహనం బయట కేవలం క్యాబేజీ మాత్రమే కనిపిస్తున్నట్లుగా అమర్చి, లోపలి భాగంలో భారీగా గంజాయిని నింపారు. స్వాధీనం చేసుకున్న 647 కేజీల గంజాయి విలువ మార్కెట్లో భారీగా ఉంటుందని అంచనా. ఈ అక్రమ రవాణాకు సంబంధించి బొలెరో డ్రైవర్‌ను పోలీసులు తక్షణమే అదుపులోకి తీసుకున్నారు.

ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి విచారణను వేగవంతం చేశారు. ఈ స్మగ్లింగ్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? ఈ గంజాయిని వైజాగ్ నుండి ఎక్కడికి తరలించాలని ప్లాన్ చేశారు? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతామని, అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా పోలీస్ యంత్రాంగం హెచ్చరించింది.

Advertisement

Also Read:  వైజాగ్ వాసులకు గుడ్ న్యూస్.. మెట్రో వచ్చేస్తోంది, డెడ్ లైన్ ఫిక్స్ చేసిన మంత్రి!

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×