E-Paper
Advertisement

Crime News: జీతం డబ్బులు అడిగాడని.. కొడుకుని తుపాకీతో కాల్చి చంపిన తండ్రి

Crime News: జీతం డబ్బులు అడిగాడని.. కొడుకుని తుపాకీతో కాల్చి చంపిన తండ్రి

Father Shoots Son Prakasam District in Ongole left son Dead: ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణం జరిగింది. కన్న కొడుకుని ఓ ఏఆర్ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చి చంపిన ఘటన కలకలంగా మారింది. స్థానిక శ్రీనివాస కాలనీకి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రసాద్ పాత ఈవీఎంలు నిల్వచేసి గోడౌన్ వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. గత కొంత కాలంగా మద్యానికి బానిసైనా ప్రసాద్.. ఇంట్లో జీతం డబ్బులు ఇవ్వడం లేదు.

ఈ క్రమంలోనే ప్రసాద్ కుమారుడు శేష కమల్ డ్యూటీలో ఉన్న తండ్రి వద్దకెళ్లి ఏటీఎం కార్డు అడిగడంతో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో సహనం కోల్పోయిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రసాద్.. శేష కమల్ ని తన వద్ద ఉన్న తుపాకీతో ఛాతి భాగంలో కాల్చాడు. వెంటనే అప్రమత్తమైన తోటి ఉద్యోగులు శేషకమల్ చికిత్స కోసం ఒంగోలు రిమ్స్ కి తరలించారు.

Also Read: మరో క్రైమ్ కథా చిత్రమ్.. మైనర్ బాలిక ఈమె, తండ్రి-అన్నను చంపేసి..

అయితే అప్పటికే శేష కమల్ మరణించినట్టు రిమ్స్ వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఏఆర్ కానిస్టేబుల్ ప్రసాద్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ సుమిత్ సునీల్ పరిశీలించారు.

 

Tags

Related News

Children Missing: ఒంగోలులో దారుణం.. నీటి కుంటలో నలుగురు చిన్నారులు గల్లంతు!

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

Big Stories

×