ACB Trap: స్వేచ్ఛ బ్యూరో: ఏసీబీ వలలో ఫారెస్ట్ బీట్ అధికారి చిక్కారు. రూ10 వేల రూపాయలు లంచం తీసుకుంటూ నరేష్ ఉద్యోగి పట్టుపడ్డాడు. ఏసీబీ డి.ఎస్పీ. వై. రమేష్ ఆధ్వర్యంలో దాడిచేసి పట్టుకున్నారు.
పోడు రైతు నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటు ఉండగా ఏసీబీ డి. ఎస్పీ. వై. రమేష్ ఆధ్వర్యంలోని ఏసీబీ బృందం గురువారం దాడి చేసి ఓ ఫారెస్టు బీట్ అధికారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రైతు నుండి పది వేలు లంచం తీసుకుంటూ, గుండాల మండలం, నడిమిగూడెం ఫారెస్టు బీట్ అధికారి బానోతు నరేష్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఫిర్యాదు రాగానే ఆ శాఖ అధికారులు డి.ఎస్పీ వై. రమేష్ బృందం వల పన్నింది.
Also read: స్వేచ్ఛ ఎఫెక్ట్.. హుజూరాబాద్ కల్తీ పాల కోటపై అధికారుల పంజా..!
మారుమూల గ్రామాల నుండి ఏసీబీకి ఫిర్యాదులు అందే స్థాయిలో ఏసీబీ అధికారులు ప్రజలను చైతన్య వంతులను చేశారు. స్పందించే తీరువల్ల ప్రజల్లో అవేర్నెస్ బాగా పెరిగింది. ఐతే గుండాల మండలం సాయనపల్లిలో పోడు రైతును ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు బీట్ అధికారి లంచం డిమాండ్ చేసి, స్వయంగా తీసుకుంటు ఏసీబీకి చిక్కడం స్ధానికంగా సంచలనం రేపింది.
Also read: కమీషన్ల కక్కుర్తి కోసం రైతులను వేదిస్తారా.. రాంచందర్ రావు ఫైర్..!