Murder Case: అన్నమయ్య జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భార్య భర్తను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. ప్రియుడితో కలిసి భార్య ఈ ఘాతుకానికి పాల్బడింది. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం నారమాకుల తండాలో ఈ సంఘటన జరిగింది.
అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం నారమాకుల తండాకు చెందిన చిన్న బుద్ధన్న నాయక్కు భార్య రమీల, మరియు ముగ్గురు కుమారులు ఉన్నారు. అయితే అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో భర్త బుద్ధన్న నాయక్ను అతి దారుణంగా హత్య చేయించింది. భార్య రమీల, ఆమే ప్రియుడు రెడెప్ప నాయక్ కలిసి హత్య చేశారు. నిందితులు భార్య బుక్కే రమీల, ఆమె ప్రియుడు రెడ్డెప్ప నాయక్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంట్లో నిద్రిస్తున్న బుద్ధన్న నాయక్, భార్య రమీల రుబ్బురోలుతో దాడి చేసి హత్య చేసింది.
Also read: యాదగిరిగుట్ట అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష.. తిరుమల మోడల్ అనుసరించాలని ఆదేశం!
అనంతరం బైక్ పై తీసుకెళ్లి ప్రియుడు రెడెప్ప నాయక్ ఇనుప సుత్తితో దాడి చేసి హత్యచేశాడు. శవాన్ని రోడ్డుపై పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసులు సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించి నిందితులను పట్టుకున్నారు. నిందితుల నుంచి హోండా యాక్టివా బైక్, ఇనుప సుత్తి, రుబ్బురోలు రాయి, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొని పోలీసులు కేసు నమోదు చేశారు.
Also read: రాజమౌళి, సుకుమార్ రూట్లోనే ‘గురూజీ’…గాడ్ ఆఫ్ వార్ తో పాన్ ఇండియా స్కెచ్!