E-Paper
Advertisement

Double Murder: భార్య ప్రియుడిని భోజనానికి పిలిచిన భర్త.. ఒక గంట తర్వాత ఇంట్లో రక్తపాతం, అసలు ఏమైంది?

Double Murder: భార్య ప్రియుడిని భోజనానికి పిలిచిన భర్త.. ఒక గంట తర్వాత ఇంట్లో రక్తపాతం, అసలు ఏమైంది?

Double Murder: వివాహేతర సంబంధాలు పచ్చని సంసారంలో చిచ్చు పెడుతున్నాయి. ఈ విషయం తెలిసి పగతో రగిలిపోతున్నారు. ఫలితంగా ఒకరినొకరు చంపుకునే ఘటనలు తీవ్రమవుతున్నాయి. తాజాగా అలాంటి ఘటన యూపీలో వెలుగుచూసింది. విందుకు ఫ్రెండ్‌ని పిలిచి అక్కడే అతడ్ని, భార్యని కాల్చి చంపాడు ఓ వ్యక్తి. అసలేం జరిగింది?

ఘజియాబాద్‌లో డబుల్ మర్డర్ వ్యవహారం తీవ్ర కలకలం

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ సిటీలో ట్రోనికా సిటీ రామ్‌పార్క్ కాలనీలో ఉంటున్నారు ఓ జంట. రషీదు వయస్సు 38 ఏళ్లు కాగా, షబ్నమ్ వయస్సు 36 ఏళ్లు. వీరిద్దరు పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు అరజడను మంది పిల్లలు ఉన్నారు. రషీద్ ఫర్నిచర్ వ్యాపారి కావడంతో అతడి వద్ద పనిచేసేవాడు ఫహీమ్. తర్వాత కాలంలో రషీద్‌కు స్నేహితుడిగా మారిపోయాడు.

రెండేళ్లుగా భార్య షబ్నమ్-ఫహీమ్ మధ్య వివాహేతర సంబంధం మొదలైంది. చాన్నాళ్లుగా ఈ విషయం మూడో కంటికి తెలియకుండా జాగ్రత్త పడ్డారు. ఆరు నెలల కిందట ఓ వివాహ వేడుక సందర్భంగా ఈ విషయం రషీద్‌కు తెలిసింది. ఆనాటి నుంచి కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. ఇలాంటివి ఆపేయాలని, పిల్లలు ఉన్నారని భార్యని పలుమార్లు హెచ్చరించాడు రషీద్.

భోజనం పెట్టి.. భార్య, ఆమె ప్రియుడ్ని చంపిన భర్త

ఆమె ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు రాలేదు. ఈ యవ్వారానికి పుల్ స్టాప్ పెట్టాలని డిసైడ్ అయ్యాడు రషీద్. అందుకోసం ముందుగా ప్లాన్ చేసుకున్నాడు. సోమవారం రాత్రి స్నేహితుడు ఫహీమ్‌ని భోజనానికి ఇంటికి పిలిచారు. రషీద్, అతడి భార్య, ఆమె ప్రియుడు ఫహీమ్ కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత ముగ్గురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి వరకు సాగింది.

పట్టరాని కోపంతో గదిలో నుంచి తీసుకొచ్చిన తుపాకీతో మొదట ఫహీమ్‌పై కాల్పులు జరిపాడు. ఆ తర్వాత భార్య షబ్నమ్‌పై గురిపెట్టాడు. తలలకు బుల్లెట్‌లు తగలడంతో ఇద్దరు అక్కడికక్కడే కుప్పకూలారు. రషీదు చేసిన జంట హత్యలను తన ఏడేళ్ల కుమారుడు దగ్గరుండి చూసి షాకయ్యాడు. ఆ తర్వాత రషీద్ తన కొడుకు వైపు చూసి అక్కడి నుంచి పరారయ్యాడు.

ALSO READ: సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే టార్గెట్.. క్యూనెట్ మోసాలు బట్టబయలు.. పూసగుచ్చినట్లు చెప్పిన సజ్జనార్!

గన్ శబ్దాలు విని ఇరుగు పొరుగు రషీదు ఇంటికి వచ్చారు. రషీద్ భార్య, ఆమె ప్రియుడ్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వారిద్దరు మృతి చెందారు. ఫహీమ్ తండ్రి ఫిర్యాదు మేరకు రషీద్‌పై హత్య కేసు నమోదు చేశారు పోలీసులు. రషీద్‌తోపాటు ఫహీమ్‌పై నేర చరిత్ర ఉంది. తన పేరు మీద పరారీలో ఉన్న రషీద్ కోసం పోలీసులు గాలిస్తున్నాయి.

Related News

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

ఆర్టీసీ బస్సులో గంజాయి దందా.. తనిఖీల్లో పోలీసులకే దిమ్మతిరిగే షాక్!

Big Stories

×