WhatsApp Status: తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా, సీతారాంపురం గ్రామంలో చోటుచేసుకున్న ఒకే కుటుంబంలో డబుల్ డెత్ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. బాలాజీ రామాచారి అనే వ్యక్తి తన భార్య సంధ్యను దారుణంగా హత్య చేసి, ఆ తర్వాత తానూ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడటం స్థానికులను దిగ్భ్రాంతికి గురి చేసింది. రామాచారి కుటుంబ జీవితంలో నెలకొన్న తీవ్రమైన కలహాలు, వేధింపులే ఈ దారుణానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. రామాచారి తన మొదటి భార్య మరణానంతరం సంధ్యను రెండో వివాహం చేసుకున్నాడు. ఈ రెండో వివాహం తర్వాత ఇంట్లో బాలాజీ రామాచారి, సంధ్య, అతని కూతురు మధ్య తరచూ గొడవలు జరిగాయి. ఈ క్రమంలోనే, నిత్యం కొనసాగుతున్న వేధింపులు, మానసిక ఒత్తిడి భరించలేక రామాచారి ఈ అత్యంత దారుణమైన నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు
ఈ ఘటనలో రామాచారి ప్రవర్తన అత్యంత భయంకరంగా ఉంది. భార్య సంధ్యను హత్య చేసిన అనంతరం, రామాచారి తన చర్యకు సంబంధించిన ఒక వీడియోను చిత్రీకరించాడు. ఆ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో స్టేటస్గా కూడా పెట్టుకున్నట్లు వెల్లడైంది. నిత్యం ఎదురవుతున్న వేధింపులను తట్టుకోలేక, తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు ఆ వీడియోలో పేర్కొని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. బాలాజీ రామాచారి ఉరివేసుకోవడానికి ముందు తన ఆవేదన, ఆగ్రహాన్ని ప్రపంచానికి చివరిసారిగా తెలియజేయడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు స్పష్టమవుతోంది.
Also Read: హిమాలయాల్లో టైమ్బాంబ్.. డేంజర్లో భారత్!
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తును ముమ్మరం చేశారు. సంధ్యను చంపడానికి గల నిర్దిష్ట కారణాలు, రామాచారిపై వేధింపులు నిజంగానే ఉన్నాయా అనే కోణంలో విచారణ చేపట్టారు.