Road Accident: అతివేగం ప్రమాదకరం.. పదే పదే పోలీసులు చెబుతున్నా వాహనదారులు ఏ మాత్రం లెక్క చేయలేదు. ఆగివున్న లారీని ఓ కారు బలంగా ఢీ కొట్టింది. ఫలితంగా కారు నుజ్జు నుజ్జు అయ్యింది. ఈ ఘటనలో ఇద్దరు స్పాట్ లో మృతువాత పడ్డారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో కరీంనగర్ జిల్లాలో జరిగింది.
కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
గురవారం రాత్రి కరీంనగర్ జిల్లా బైపాస్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బొమ్మకల్ శివారులోని ఆగి వున్న లారీని బలంగా ఢీ కొట్టింది కారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులు స్పాట్ లో మృత్యువాతపడ్డారు. ఘటన సమయంలో కారులో నలుగురు వ్యక్తులు ఉన్నారు. మృతులు 19 ఏళ్ల అబ్దుల్ రెహమాన్, 21 ఏళ్ల అతియాబ్ హుస్సేన్లుగా గుర్తించారు.
గాయపడిన మరో ఇద్దర్ని సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని, మరొకరకు స్వల్పంగా గాయపడినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో కారు నుజ్జు నుజ్జు అయ్యింది. అయితే కారులో నుంచి ఓ వ్యక్తి దూకడంతో స్వల్ప గాయాలతో బయటపడినట్టు తెలుస్తోంది.
ఆగివున్న లారీని ఢీ కొట్టిన కారు, స్పాట్లో ఇద్దరు మృతి
రోడ్డు ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడి చేరుకున్నారు. వాహనాలను పక్కకు తొలగించి, ట్రాఫిక్ క్లియర్ చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ ఘటన గురించి మృతుల తల్లిదండ్రులకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.