Road Accident: సూర్యాపేట జిల్లా కోదాడలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న లారీని వెనుక నుండి బలంగా ఢీ కొట్టింది ట్రావెల్ బస్సు. ఆ సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. వెంటనే అధికారులు అక్కడికి చేరుకుని బాధితులను ఆసుపత్రికి తరలించారు. అసలు ఘటన ఎలా జరిగింది?
సూర్యాపేట్ జిల్లా కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం
సూర్యాపేట జిల్లా కోదాడలో ఆదివారం వేకువ జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ట్రావెల్ బస్సు, ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సులో ఆరుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటన సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులున్నారు.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత వాహనాలను వేరు చేసి సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు చెప్పిన వివరాల ఈ విధంగా ఉన్నాయి. కాకినాడ నుంచి హైదరాబాద్కు ప్రయాణికులతో యోలా ట్రావెల్స్ బస్సు బయలు దేరింది.
లారీని ఢీ కొట్టిన ట్రావెల్ బస్సు.. నుజ్జైన ముందు పార్టు
కోదాడ పట్టణ సమీపంలోనికి రాగానే బస్సు ప్రమాదానికి గురైంది. అత్యంత వేగంగా వస్తున్న బస్సు, ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఘటన సమయంలో డ్రైవర్ నిద్రమత్తులో ఉండడమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. అయతే ట్రావెల్ బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జైంది.
బస్సు.. లారీని ఢీకొట్టడంతో లోపల నిద్రలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే భయంతో తమను రక్షించాలంటూ కేకలు వేశారు. గాయపడిన ప్రయాణికులను 108 వాహనంలో సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాలను పక్కకు తొలగించిన పోలీసులు, ట్రాఫిక్ను క్లియర్ చేశారు.
ALSO READ: అనకాపల్లిలో గాలివాన బీభత్సం.. ఇద్దరు కూలీల దుర్మరణం!
TG: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ జాతీయ రహదారిపై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. కాకినాడ నుండి హైదరాబాద్ వెళ్తున్న 'యోలా' ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ముందు వెళ్తున్న లారీని వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉండగా, ఆరుగురికి… pic.twitter.com/521tr8IGyo
— ChotaNews App (@ChotaNewsApp) May 24, 2026