E-Paper
Advertisement

విశాఖ సిటీలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ-బస్సు ఢీ.. స్పాట్ లో ముగ్గురు మృతి

విశాఖ సిటీలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ-బస్సు ఢీ.. స్పాట్ లో ముగ్గురు మృతి
Advertisement

Visakha: విశాఖ సిటీలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగివున్న లారీని బలంగా ఢీ కొట్టింది ఆర్టీసీ బస్సు, ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన విశాఖ ఎయిర్‌పోర్టు సమీపంలోని శ్రీనగర్ ప్రాంతం వద్ద ఘటన చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైన బస్సు రాజమండ్రి నుంచి పార్వతీపురంలోని రామభద్రపురం వెళ్తోంది.

ఈ ఘటనలో దాదాపు 10 మంది వరకు గాయపడినట్టు తెలుస్తోంది. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. క్షతగ్రాతులను సమీపంలోని అంబులెన్సులో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలోని మృతి చెందినవారు.. ఇద్దరు మహిళలు, డ్రైవర్ ఉన్నారు.

Advertisement

గాయపడినవారిని చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. రోడ్డు ప్రమాదం కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాలను క్రేన్ల ద్వారా పక్కకు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

Advertisement

 

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×