Keesara Robbery: కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ జ్యువెలర్స్ షాపులో జరిగిన సంచలన దోపిడీ యత్నం కేసును మల్కాజిగిరి పోలీసులు విజయవంతంగా ఛేదించారు. షాపు యజమానిపై పాశవికంగా దాడి చేసి పరారైన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
జనవరి 2, 2026న నాగారం సత్యనారాయణ కాలనీ, రంపల్లి ఎక్స్ రోడ్స్ సమీపంలోని బాలాజీ జ్యువెలర్స్లో పట్టపగలే ఈ దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు దుండగులు బైక్పై వచ్చి కస్టమర్ల మాదిరిగా నమ్మించి షాపులోకి ప్రవేశించారు. అదును చూసి వెంట తెచ్చుకున్న నకిలీ తుపాకీ (డమ్మీ గన్) గురిపెట్టి యజమాని సందీప్ను బెదిరించారు. డబ్బు, బంగారం ఇవ్వాలంటూ గొడ్డలితో సందీప్పై విచక్షణారహితంగా దాడి చేశారు.
అయితే, ప్రాణాలకు తెగించి యజమాని సందీప్ దుండగులను ప్రతిఘటించారు. ఆయన ధైర్యానికి భయపడిన దుండగులు.. దోపిడీ సాధ్యంకాదని భావించి ఏమీ ఎత్తుకెళ్లకుండానే అక్కడి నుంచి పరారయ్యారు. ఈ గొడవలో సందీప్ తీవ్రంగా గాయపడ్డారు, ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మొత్తం దృశ్యాలు షాపులోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.వేట:
ఘటనపై కేసు నమోదు చేసుకున్న మల్కాజిగిరి పోలీసులు సీసీటీవీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించారు. దుండగులు వచ్చిన బైక్ నెంబర్, వారు వెళ్లిన మార్గాలను విశ్లేషించి ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. సాంకేతిక ఆధారాలతో నిందితుల ఆచూకీ కనిపెట్టి, వారిని అదుపులోకి తీసుకున్నారు. జల్సాలకు అలవాటుపడి, సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
Read Also: తీవ్ర విషాదం.. పాయిజన్ ఇంజెక్షన్ తీసుకుని జూనియర్ డాక్టర్ మృతి..