E-Paper
Advertisement

Siddipet: తీవ్ర విషాదం.. పాయిజన్ ఇంజెక్షన్ తీసుకుని జూనియర్ డాక్టర్ మృతి..

Siddipet: తీవ్ర విషాదం.. పాయిజన్ ఇంజెక్షన్ తీసుకుని జూనియర్ డాక్టర్ మృతి..

Siddipet: సిద్దిపేట జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అయితే సిద్దిపేటలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో పీజీ రెండవ సంవత్సరం చదువుతున్న జూనియర్ డాక్టర్ లావణ్య మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. విధి నిర్వహణలో ఉంటూనే ఆమె ఆదివారం ఉదయం అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. తన గదిలోనే అత్యంత ప్రమాదకరమైన విషపూరిత ఇంజక్షన్‌ను నేరుగా సిర (vein) లోకి తీసుకుని ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారు.

దీంతో తోటి వైద్యులు వెంటనే గుర్తించి ఆమెకు ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ, పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమె ప్రాణాలను కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ, ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ సోమవారం ఆమె తుదిశ్వాస విడిచారు.

అయితే లావణ్య ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. వ్యక్తిగత కారణాలా లేక పని ఒత్తిడి వంటి అంశాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులు, తోటి విద్యార్థుల నుంచి పోలీసులు స్టేట్‌మెంట్లను సేకరిస్తున్నారు.

అయితే చదువులో ప్రతిభ కనబరుస్తూ, డాక్టర్‌గా సమాజానికి సేవ చేయాలని ఆశించిన యువతి ఇలా అర్ధాంతరంగా మృతి చెందడంతో కుటుంబ సభ్యుల్లోనూ, వైద్య వర్గాల్లోనూ తీరని వేదనను మిగిల్చింది.

Related News

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

ఆర్టీసీ బస్సులో గంజాయి దందా.. తనిఖీల్లో పోలీసులకే దిమ్మతిరిగే షాక్!

Big Stories

×