BigTV English
Advertisement

Kurnool Bus Accident: వీడని మృత్యువు.. కర్నూలు మృతుల అంత్యక్రియలకు వెళ్లొస్తూ..

Kurnool Bus Accident: వీడని మృత్యువు.. కర్నూలు మృతుల అంత్యక్రియలకు వెళ్లొస్తూ..

Kurnool Bus Accident: హైదరాబాద్ నుంచి గురువారం రాత్రి బెంగళూరుకు బయల్దేరిన కావేరీ ట్రావెల్.. బస్సు శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు సమీపంలో ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నెల్లూరుకి చెందిన ఒకే కుటుంబం మృతి చెందారు.


అయితే ఈరోజు(సోమవారం) కర్నూలు బస్సు ప్రమాదంలో చనిపోయిన రమేష్ కుటుంబ సభ్యుల అంత్యక్రియల్లో.. పాల్గొని ఇంటికి వెళ్తుండగా వారి కుటుంబ సభ్యులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా.. ఒకరు స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తోంది.

వింజమూరు మండలం గోళ్లవారి పల్లి నుంచి విడయవాడ వెళ్తున్నారు. జలదంకిలో వీరు కారు టైర్ పంక్చర్ కావడంతో ఒక్కసారిగా అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.


కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం.. అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 19 మంది ప్రయాణికులు మృతి చెందారు. మంటల్లో సజీవదహనం అయ్యారు. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను విషాదాన్ని నింపింది.

Also Read: పెళ్లి చేయాలని హైటెన్షన్ టవర్ ఎక్కిన యువకుడు.. కాపాడే ప్రయత్నంలో

రోడ్డుపై పడి ఉన్న బైక్‌ను బస్సు ఈడ్చుకెళ్లడంతో.. మంటలు చెలరేగాయని పోలీసులు వెల్లడించారు. క్షణాల్లోనే మంటలు వేగంగా వ్యాపించాయని, మంటల్లో బస్సు పూర్తిగా కాలి బూడిదైందని పేర్కొన్నారు. బస్సులోని కొందరు ప్రయాణికులు అతికష్టం మీద తమ ప్రాణాలను కాపాడుకోగా, మరికొందరు బయటకు వచ్చేలోపే మంటలు చుట్టుముట్టడంతో సజీవ దహనం అయ్యారు.

Related News

Medak News: కర్నూల్ బస్సు ప్రమాదం.. 3రోజుల తర్వాత తల్లీకూతుళ్ల అంత్యక్రియలు, స్థానికుల కంటతడి

Cyber Crime: ముగ్గురు సోదరీమణుల ఏఐ జనరేటేడ్ ఫోటోలతో బ్లాక్‌మెయిల్.. ఆత్మహత్య చేసుకున్న సోదరుడు!

Shocking Video: పెళ్లి చేయాలని హైటెన్షన్ టవర్ ఎక్కిన యువకుడు.. కాపాడే ప్రయత్నంలో

Delhi Crime: ప్రియుడిని దారుణంగా ప్లాన్ చేసి హత్య చేసిన ప్రియురాలు.. చివరకు ఏమైందంటే?

Gold Theft: నిజామాబాద్‌లో దొంగల బీభత్సం.. భారీగా బంగారం, వెండి నగలు చోరీ

Delhi Crime: ఆర్మీ అధికారినంటూ పరిచయం.. ఆపై వైద్యురాలిపై అత్యాచారం, నిందితుడెవరు తెలుసా?

Khammam Tragedy: టూత్ పేస్ట్ అనుకుని ఎలుకల మందు తిని.. మూడేళ్ల చిన్నారి మృతి

Big Stories

×