E-Paper
Advertisement

Landslide sweeps 2 buses in Nepal: నేపాల్‌లో నదిలో పడిన రెండు బస్సులు.. ఇద్దరు డ్రైవర్లతో సహా 65 మంది గల్లంతు!

Landslide sweeps 2 buses in Nepal: నేపాల్‌లో నదిలో పడిన రెండు బస్సులు.. ఇద్దరు డ్రైవర్లతో సహా 65 మంది గల్లంతు!
Advertisement

Two buses into Trishuli River in Nepal: నేపాల్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రకృతి బీభత్సానికి నారాయణఘాట్, ముగ్‌లింగ్ జాతీయ రహదారిపై తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ సమయంలో భారీ వర్షం కూడా కురుస్తుండగా.. అదే మార్గంలో వెళ్తున్న రెండు బస్సులపై ఆ కొండచరియలు విరిగిపడడంతో పక్కనే ఉన్న త్రిశూన్ నదిలో పడిపోయాయి. ఈ రెండు బస్సుల్లో 63 మంది ప్రయాణికులు ఉండగా.. ఇద్దరు డ్రైవర్లతో కలిపి మొత్తం 65 మంది గల్లంతయ్యారు. కాగా, ఇందులో ఏడుగురు భారతీయులు ఉన్నట్లు సమాచారం.

నేపాల్ రాజధాని ఖాట్మండుకు ఏంజెల్ బస్సు, గణపతి డీలక్స్ బస్సులు వెళ్తుండగా.. శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి కొండచరియలు విరిగిపడి బస్సులపై పడ్డాయి. దీంతో అదుపు తప్పి పక్కన ఉన్న నదిలో పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఈ మేరకు పడవలతో నదిలో దిగి గల్లంతైన 65మంది ఆచూకీ కోసం ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు చిత్వాన్ చీఫ్ ఆఫీసర్ ఇంద్రవేవ్ యాద్ తెలిపారు.

Advertisement

ఖాట్మండు వెళ్తున్న ఓ బస్సులో 24 మంది ప్రయాణికులు ఉండగా.. మరో బస్సులో 41మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో గణపతి డీలక్స్‌కు చెందిన బస్సు నుంచి ముగ్గురు ప్రయాణికులు తప్పించుకున్నట్లు తెలుస్తోంది. బస్సు ప్రమాదానికి గురైన వెంటనే బయటకు దూకినట్లు సమాచారం. ఇదే మార్గంలో మరో బస్సుపై కొండచరియలు పడడంతో డ్రైవర్ తీవ్రంగా గాయపడి మృతి చెందారు. మృతుడు మేఘనాథ్‌గా గుర్తించారు.

Also Read: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, బస్సును ఢీకొన్న టిప్పర్, 9 మంది మృతి

Advertisement

బస్సు ప్రమాదాలపై నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఏజెన్సీలు బాధితుల ఆచూకీని తెలుసుకునేలా అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఆ దేశ సాయుధ దళాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×