E-Paper
Advertisement

Markapuram: స్కూల్ ఆవరణలో శవం పాతిపెట్టిన వైసీపీ నేత.. స్థలం తనదేనంటూ వాదన

Markapuram: స్కూల్ ఆవరణలో శవం పాతిపెట్టిన వైసీపీ నేత.. స్థలం తనదేనంటూ వాదన
Advertisement

Markapuram: మార్కాపురం జిల్లాలో అనూహ్య ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో తండ్రి శవాన్ని పూడ్చిపెట్టారు. తర్లుపాడు మండలం గానుగపెంట ఎస్సీ కాలనీలో స్థానిక వైసీపీ నేత కిరణ్.. తన తండ్రి మృతదేహాన్ని ఇళ్ల మధ్య ఉన్న స్కూల్ గ్రౌండ్ లో శనివారం సాయంత్రం పూడ్చేందుకు ప్రయత్నించారు. అయితే గ్రామస్థులు, స్కూల్ హెడ్ మాస్టర్.. కిరణ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.

గోడ కట్టమన్న తహసీల్దార్

స్కూల్ పిల్లలు భయపడతారని చెప్పినా కిరణ్‌ వినిపించుకోలేదు. ఆ స్థలం తనదే అంటూ తండ్రి శవాన్ని అక్కడే పూడ్చి పెడతానంటూ వారితో వాగ్వాదానికి దిగాడు. చివరకు పాఠశాల ఆట స్థలంలోనే తండ్రి మృతదేహాన్ని పూడ్చేశారు. ఈ విషయాన్ని గ్రామస్థులు, హెడ్ మాస్టర్ గ్రామపంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే వారు కిరణ్ ను అడ్డుకోలేదని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై తహసీల్దార్‌ కిశోర్‌ కుమార్‌ స్పందించారు. శవం పూడ్చిన స్థలం చుట్టూ గోడ కట్టాలని సూచించామన్నారు.

Advertisement

స్కూల్ ఆవరణలో శవాన్ని పూడ్చిపెట్టడంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. మృతదేహాన్ని మరో చోట పూడ్చిపెట్టాలని స్థానికులు కోరుకున్నారు. ఇళ్ల మధ్యలో ఇలాంటి కార్యక్రమాలు సరికాదంటున్నారు.

Also Read: హెల్మెట్ పెట్టుకున్నాడు.. కానీ, చావు తప్పలేదు, కారణం ఈ తప్పే!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×