Medchal Crime: స్వేచ్ఛ బ్యూరో: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అల్వాల్ పోలీస్స్టేషన్ పరిధిలోని మచ్చ బొల్లారంలో చోరీ ఘటన కలకలం రేపింది. ఇంటి యజమాని రమేష్ కుటుంబంతో కలిసి అరుణాచల్ ప్రదేశ్కు వెళ్లిన సమయంలో దుండగులు పక్కా ప్రణాళికతో ఇంట్లోకి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు.
Also read: తెలంగాణలో జూన్ 1 నుంచి 12 వరకు ఏం జరగబోతోంది? సర్కార్ భారీ ‘ప్రగతి’ ప్లాన్ ఇదే!
ఇంటి గేటు, తాళాలు పగులగొట్టి లోనికి చొరబడ్డ దొంగలు సుమారు 30 తులాల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, రూ.లక్ష నగదును అపహరించినట్లు సమాచారం. ఇంటి తాళాలు పగిలి ఉండటాన్ని గమనించిన స్థానికులు యజమాని రమేష్కు సమాచారం అందించారు. దీంతో ఆయన హుటాహుటిన అరుణాచల్ ప్రదేశ్ నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరిస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. CCTV ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
Also read: టాప్ 5 దుమ్మురేపే యాక్షన్ సినిమాలు… ఓటీటీ తగలడిపోవాల్సిందే భయ్యా