E-Paper
Advertisement

Medchal Crime : నడిరోడ్డుపై యువకుడిని కత్తులతో పొడిచి హత్య – పట్టపగలే దారుణం

Medchal Crime : నడిరోడ్డుపై యువకుడిని కత్తులతో పొడిచి హత్య – పట్టపగలే దారుణం
Advertisement

Medchal Crime : పాతకాలంలో పోలీసులు, చట్టాలు సరిగా లేని సమయంలో నడిరోడ్డుపై హత్యలు జరిగేవి అంటే అవునా అని నోరెళ్లబెడుతుంటారు.. కానీ, ఆదివారం నాడు హైదరాబాద్ లో నడిరోడ్డుపై దారుణ హత్య చోటుచేసుకుంది.  పట్టపగలు, అందరూ చూస్తుండగానే అత్యంత పాశవికంగా హత్యకు ఓ యువకుడిని కత్తులతో పొడిచి, పొడిచి చంపేశారు. సినిమా తరహాలో రోడ్డుపై కత్తులతో నిండు ప్రాణాన్ని  తీసేశారు.

ఏదో మారుమూల ప్రాంతాల్లో హత్య జరిగింది అంటే ఏమో అనుకోవచ్చు కానీ.. నిత్యం వేల మంది నడిచివెళ్లే దారిపై ఎలాంటి భయం లేకుండా ఓ యువకుడిని పొడిచి చంపేశారు ఇద్దరు యువకులు. రోడ్డుపై వెళుతున్న ఓ యువకుడిని వెంబడించిన ఇద్దరు యువకులు.. కత్తులతో విరుచుకుపడ్డారు. క్షణాల్లోనే యువకుడిని కిందపడేసి.. కత్తులతో కుళ్లపొడిచారు.

Advertisement

ఈ ఘటన సిటీ పరిధిలోని మేడ్చల్ లో జరిగింది. అప్పటి వరకు ప్రశాంతంగా సాగిన అక్కడి వాతావరణం.. ఈ హత్యతో ఉద్రిక్తంగా మారిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉమేష్ (25) అనే వ్యక్తి నడుచుకుంటూ వెళుతుండగా.. ఓ ఇద్దరు వ్యక్తులు నడిరోడ్డుపై కత్తులతో పొడిచి చంపేశారు. క్షణాల్లోనే అక్కడి నుంచి రోడ్డు దాటుకుని నడుచుకుంటూ వెళ్లిపోయారు. ఈ ఘటనను అక్కడే ఉన్న ఓ వ్యక్తి సెల్ ఫోన్లో చిత్రీకరించాడు. దాంతో.. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

హత్య తర్వాత స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. కాగా.. ఘటనలో చనిపోయిన ఉమేష్ కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారంతా యువకుడి మృతదేహం దగ్గర కూర్చోని, కన్నీళ్లు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ దృశ్యాలు అక్కడ ఉన్నవారందరినీ కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.

Advertisement

Also Read : చిచ్చుపెట్టిన వివాహేతర సంబంధం.. ఫ్యామిలీ సూసైడ్, ఏం జరిగింది?

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై విచారణ ప్రారంభించారు. ఏవైనా పాత కక్షలతో ఈ హత్యలు జరిగాయా లేదంటే మరేదైనా కారణాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×