E-Paper
Advertisement

తాండూరులో కలకలం.. కూతురి ప్రేమను విడగొట్టేందుకు తల్లి ‘క్షుద్రపూజలు’

తాండూరులో కలకలం.. కూతురి ప్రేమను విడగొట్టేందుకు తల్లి ‘క్షుద్రపూజలు’
Advertisement

Vikarabad: వికారాబాద్ జిల్లా తాండూరులో జరిగిన ఓ ఘటన అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. కన్న కూతురు అని కూడా చూడకుండా.. ఆమె ప్రేమను చెడగొట్టాలనే ఆలోచనతో ఓ తల్లి చేసిన పని స్థానికంగా కలకలం రేపింది. తాండూరులోని ఇంద్ర నగర్ కాలనీలో నివసించే ఓ మహిళ, తన కూతురు ఒకరిని ప్రేమిస్తోందన్న విషయం తెలిసి తట్టుకోలేకపోయింది.  ఎలాగైనా ఆ ప్రేమను విడగొట్టాలని భావించి, తప్పుడు మార్గాన్ని ఎంచుకుంది.

సమస్యను మాటలతో పరిష్కరించుకోవాల్సింది పోయి, ఒక మంత్రగాడిని ఆశ్రయించింది. అతని సలహాతో కన్న కూతురిపైనే క్షుద్ర పూజలు చేయించేందుకు సిద్దపడింది. ఇందులో భాగంగా ఇంద్రనగర్ కాలనీ సమీపంలోని ఒక నిర్మానుష్య ప్రాంతానికి తన కూతురిని తీసుకెళ్లి, అక్కడ మంత్రగాడితో కలిసి పూజలు మెుదలుపెట్టింది.

Advertisement

అయితే.. నిర్మానుష్య ప్రదేశంలో అర్థరాత్రి వేల వింతగా పూజలు చేస్తుండటాన్ని గమనించిన స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ఏం జరుగుతుందో చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. వెంటనే అప్రమత్తమైన జనం ఆ మంత్రగాడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం నిందితుడిని పోలీసులకు అప్పగించారు. కన్న తల్లే ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మి కూతురి జీవితంతో ఆడుకోవాలని చూడటంపై స్థానికుల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

Also Read: హయత్‌నగర్ పెట్రోల్ బంక్‌లో నయా మోసం.. 27 లీటర్ల ట్యాంక్.. 32 లీటర్ల బిల్లు.. అసలు ఏం జరుగుతోంది?

Advertisement

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×