E-Paper
Advertisement

Mother Puts Baby in Oven: దారుణం.. చంటిపాపను పొరపాటున ఓవన్‌లో పెట్టి మరిచిపోయిన తల్లి

Mother Puts baby in Oven | నెల వయసున్న ఓ చంటి పాప నిద్రపోయిన తరువాత తల్లి.. ఆ పాపను పొరపాటున ఓవన్(తలుపు ఉన్న ఎలెక్ట్రిక్ పొయ్యి)లో పెట్టి మరిచి పోయింది. కొద్ది సేపు తరువాత ఆమెకు తన పాప గురించి గుర్తుకు వచ్చి.. వెళ్లి చూస్తే.. పాప ఊపిరి తీసుకోవడం లేదు.

Mother Puts Baby in Oven: దారుణం.. చంటిపాపను పొరపాటున ఓవన్‌లో పెట్టి మరిచిపోయిన తల్లి

Mother Puts baby in Oven: నెల వయసున్న ఓ చంటి పాప నిద్రపోయిన తరువాత తల్లి.. ఆ పాపను పొరపాటున ఓవన్(తలుపు ఉన్న ఎలెక్ట్రిక్ పొయ్యి)లో పెట్టి మరిచి పోయింది. కొద్ది సేపు తరువాత ఆమెకు తన పాప గురించి గుర్తుకు వచ్చి.. వెళ్లి చూస్తే.. పాప ఊపిరి తీసుకోవడం లేదు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళితే.. డాక్టర్లు పాప చనిపోయిందని తెలిపారు. ఈ ఘటన అమెరికాలోని కన్సాస్ నగరంలో జరిగింది.

అమెరికాలోని మిస్సోరి రాష్ట్రం కన్సాస్ నగరంలో నివసించే మరియా థామస్(26) అనే మహిళ తన పాపను తీసుకొని డాక్టర్ల వద్దకు వెళ్లగా.. డాక్టర్లు పాపను పరీక్షించారు. పాప వేసుకున్న డైపర్ కాలి ఉంది. పాప శరీరంపై కాలిన గాయాలున్నాయి. దీంతో డాక్టర్లు పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు.. పాప తల్లిని విచారణ చేయగా.. తాను పాపను క్రిబ్(చిన్నపిల్లల మంచం)లో పడుకోబెట్టడానికి పోయి.. పొరపాటున ఓవన్‌లో పెట్టేశానని తెలిపింది. అయితే పోలీసులు ఆమె కావాలనే పాపను ఓవన్‌లో పెట్టి హత్య చేసి ఉంటుందని అనుమానిస్తున్నారు. అందుకే మారియాని పోలీసులు అరెస్టు చేశారు.

మరియా గురించి మరింత విచారణ చేయగా.. ఆమె మానసిక స్థితి సరిగా లేదని ఇరుగుపొరుగు వారు తెలిపారు.

Tags

Related News

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

Big Stories

×